కామారెడ్డి జిల్లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడలో ఆర్టీఓ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానుభావుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఎల్లారెడ్డి జివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్... జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా రోజురోజుకు వ్యాప్తి చెందుతుండటం వల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!