ETV Bharat / state

మూడురోజుల వ్యవధిలో కరోనాతో భార్యాభర్తలు మృతి - కామారెడ్డి జిల్లా తాజా వార్తలు

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో కరోనా మహమ్మారి భార్యాభర్తలను బలితీసుకుంది. మూడు రోజుల కిందట యాట సైదులు అనే వ్యక్తి కొవిడ్​తో మృతి చెందగా... నేడు ఆయన భార్య ప్రాణాలు కోల్పోయింది. వారి మరణంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Husband and wife die with Corona
కరోనాతో భార్యాభర్తలు మృతి
author img

By

Published : Apr 23, 2021, 1:22 PM IST

కరోనా కారణంగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన... కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మూడు రోజుల కిందట యాట సైదులు అనే వ్యక్తి కొవిడ్​తో మృతి చెందగా... నేడు ఆయన భార్య యాట బాగవ్వ (66) మరణించింది. ఈ నెల 15న త్రీవ జర్వంతో దంపతులిద్దరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​ వచ్చింది.

అప్పటినుంచి ఇద్దరూ హోం ఐసోలేషన్​లో ఉంటూ మందులు వాడుతున్నారు. మూడు రోజుల కిందట కొవిడ్​తో భర్త మృతిచెందాడు. ఈ రోజు భార్య ప్రాణాలు కోల్పోయింది. కరోనాతో బిర్కుర్ మండల కేంద్రంలో ఇద్దరూ చనిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కరోనా కారణంగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన... కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మూడు రోజుల కిందట యాట సైదులు అనే వ్యక్తి కొవిడ్​తో మృతి చెందగా... నేడు ఆయన భార్య యాట బాగవ్వ (66) మరణించింది. ఈ నెల 15న త్రీవ జర్వంతో దంపతులిద్దరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​ వచ్చింది.

అప్పటినుంచి ఇద్దరూ హోం ఐసోలేషన్​లో ఉంటూ మందులు వాడుతున్నారు. మూడు రోజుల కిందట కొవిడ్​తో భర్త మృతిచెందాడు. ఈ రోజు భార్య ప్రాణాలు కోల్పోయింది. కరోనాతో బిర్కుర్ మండల కేంద్రంలో ఇద్దరూ చనిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి రాహుల్ చురకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.