కామారెడ్డి జిల్లా లింగంపేట మండంలోని కాంగ్రెస్ ఎంపీటీసీలు తెరాసలో చేరారు. పోతాయిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు కమ్మరి కల్యాణి, లింగంపల్లి ఎంపీటీసీ మన్నె బాగవ్వ.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెరాసలో 200 కుటుంబాల చేరిక