కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీకి పోచారం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా నివారణ రసాయన ద్రావణ పిచికారీ యంత్రాన్ని బహూకరించారు. ట్రస్ట్ నిర్వాహకులు పోచారం సురేందర్ రెడ్డి స్థానిక మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్కి దీనిని అందజేశారు. ఈ యంత్రం విలువ రూ. 3.10 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. 200 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ను కలిగి 180 డిగ్రీల కోణంలో తిరుగుతూ 30 అడుగుల వరకు ద్రావణాన్ని పిచికారీ చేయగలదని చెప్పారు.
ఇదీ చూడండి:- రూ.600తో 20 నిమిషాల్లోపే కరోనా పరీక్ష ఫలితాలు