కేంద్ర ప్రభుత్వం తమ పొట్ట కొట్టడానికి చూస్తోందని బీడీ కార్మికులు ఆరోపించారు. పొగాకు ఉత్పత్తుల చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన కోఫ్టా చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
రెండు గంటలు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో 12 రకాల నిబంధనలు పెట్టి తమను రోడ్డున పడేస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: టెక్స్టైల్ పార్క్ వద్ద కార్మికుల నిరసన