రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జలసంపద పెరగాలని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల పరిధిలోని మంజీరా నదిపై రూ.28.29 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను ఆయన ప్రారంభించారు.
అదేవిధంగా బాన్సువాడ వద్ద రూ.18 కోట్లతో చెక్ డ్యాములు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజాంసాగర్ నుంచి మంజీరా నదిపై చెక్ డ్యాములు ఏర్పాటు చేసి భూగర్భజలాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, బాన్సువాడ తెరాస ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.