ETV Bharat / state

గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధి: నిరంజన్​ రెడ్డి

గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్​లో సుమారు కోటి రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్​ను ప్రారంభించారు.

author img

By

Published : Dec 25, 2020, 3:10 PM IST

agriculture minister singireddy niranjan reddy tour in kamareddy district
గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధి: నిరంజన్​ రెడ్డి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్​లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పర్యటించారు. సుమారు ఒక కోటి రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్​ను​ ప్రారంభించారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, రైతు వేదిక భవనం, మహిళ సమైక్య భవనాన్ని ప్రారంభించారు.

గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. తెరాస ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. త్వరలో అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్​లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పర్యటించారు. సుమారు ఒక కోటి రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్​ను​ ప్రారంభించారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, రైతు వేదిక భవనం, మహిళ సమైక్య భవనాన్ని ప్రారంభించారు.

గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. తెరాస ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. త్వరలో అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రజినీకాంత్​కు అస్వస్థత..​ జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.