ETV Bharat / state

బ్లాక్​ ఫంగస్​తో మరో మరణం

author img

By

Published : May 17, 2021, 9:20 AM IST

కొవిడ్​ నుంచి కోలుకున్నవారికి.. బ్లాక్​ ఫంగస్ మరో ముప్పుగా మారుతోంది. దేశంలో ప్రస్తుతం ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతువుతున్నాయి. ఇప్పటికే పలువురు ఫంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్రంలోనూ మ్యూకర్​మైకోసిస్ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి నిన్న ఫంగస్ ధాటికి బలయ్యాడు.

 black fungus deaths
black fungus deaths

బ్లాక్​ ఫంగస్​తో రాష్ట్రంలో మరో మరణం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన అంజల్ రెడ్డికి గత నెల 23వ తేదీన కరోనా సోకడంతో.. నిజామాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. 12 రోజుల పాటు చికిత్స పొందిన ఆయన.. కోలుకొని మే 8న డిశ్చార్జి అయ్యారు.

అనంతరం కన్ను ఎర్రబారి ఇబ్బందులు తలెత్తడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు వెళ్లగా.. వారు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సరోజినీ వైద్యులు పరీక్షించి.. బ్లాక్‌ ఫంగస్‌ సోకి ఉండొచ్చని భావించి కేర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. మే 11న అంజల్‌రెడ్డి కేర్‌ ఆసుపత్రిలో చేరారు. బ్లాక్‌ఫంగస్‌ సోకినట్లు నిర్ధారించిన వైద్యులు.. ఆయనకు ఓ కన్ను, దవడ తొలగించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. అతను మృతి చెందాడు.

బ్లాక్​ ఫంగస్​తో రాష్ట్రంలో మరో మరణం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన అంజల్ రెడ్డికి గత నెల 23వ తేదీన కరోనా సోకడంతో.. నిజామాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. 12 రోజుల పాటు చికిత్స పొందిన ఆయన.. కోలుకొని మే 8న డిశ్చార్జి అయ్యారు.

అనంతరం కన్ను ఎర్రబారి ఇబ్బందులు తలెత్తడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు వెళ్లగా.. వారు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సరోజినీ వైద్యులు పరీక్షించి.. బ్లాక్‌ ఫంగస్‌ సోకి ఉండొచ్చని భావించి కేర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. మే 11న అంజల్‌రెడ్డి కేర్‌ ఆసుపత్రిలో చేరారు. బ్లాక్‌ఫంగస్‌ సోకినట్లు నిర్ధారించిన వైద్యులు.. ఆయనకు ఓ కన్ను, దవడ తొలగించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. అతను మృతి చెందాడు.

ఇదీ చదవండి: ఆకలి కోరల్లో అభాగ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.