ETV Bharat / state

అలంపూర్​ సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం - జోగులాంబ గద్వాల ఆలంపూర్​ సరిహద్దు తనిఖీలు

ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించినందున జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ సరిహద్దులో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​ల నుంచి తెలంగాణలోకి వచ్చేవారిని తనిఖీలు చేస్తున్నారు. అనుమతి లేకుండా వచ్చేవారిని వెనక్కు పంపిస్తున్నారు.

ఆలంపూర్​ సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం
ఆలంపూర్​ సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం
author img

By

Published : May 3, 2020, 4:44 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సరిహద్దులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల్లోని వారు సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం వల్ల తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అలంపూర్​లోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిఘా పెంచారు. ప్రత్యేక చెక్​పోస్టును ఏర్పాటు చేశారు.

తమిళనాడు, కర్ణాటక ఆంధ్రప్రదేశ్​ల నుంచి రాష్ట్రంలోనికి వచ్చే వారిని చెక్​పోస్టు వద్ద ఆపి వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి థర్మల్ స్కానర్​తో వైద్య సిబ్బంది నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. అనంతరం చేతిపై ముద్రవేసి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని బయట తిరగవద్దని సూచిస్తున్నారు. అనుమతులు లేకుండా వచ్చేవారిని తిరిగి వెనక్కు పంపిస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సరిహద్దులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల్లోని వారు సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం వల్ల తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అలంపూర్​లోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిఘా పెంచారు. ప్రత్యేక చెక్​పోస్టును ఏర్పాటు చేశారు.

తమిళనాడు, కర్ణాటక ఆంధ్రప్రదేశ్​ల నుంచి రాష్ట్రంలోనికి వచ్చే వారిని చెక్​పోస్టు వద్ద ఆపి వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి థర్మల్ స్కానర్​తో వైద్య సిబ్బంది నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. అనంతరం చేతిపై ముద్రవేసి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని బయట తిరగవద్దని సూచిస్తున్నారు. అనుమతులు లేకుండా వచ్చేవారిని తిరిగి వెనక్కు పంపిస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్‌ భేష్‌'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.