ETV Bharat / state

సాదాసీదాగా తుంగభద్ర పుష్కరాలు!

author img

By

Published : Oct 8, 2020, 5:20 AM IST

తుంగభద్ర పుష్కరాలకు నెలన్నర సమయం మాత్రమే ఉంది. ఇంకా అధికార యంత్రాగానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ కాలేదు. పుష్కరాల నిర్వహణకు దేవాదాయశాఖ మూడు కోట్లతో ప్రతిపాదనలు పంపగా... ఇతర శాఖలేవీ వాటి జోలికే వెళ్లలేదు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణంగా పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

thungabadra river  Pushcarts in jogulamba gadwala district
సాదాసీదాగా తుంగభద్ర పుష్కరాలు!

పన్నెండేళ్ల ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ప్రవేశించే రాశి ఆధారంగా ఒక్కో నదిని ఒక్కో సమయంలో పుష్కరుడు అవహించి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. బృహస్పతి మకర రాశిలో ప్రవేశిస్తున్న సమయంలో అంటే నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటి వరకు 12 రోజుల పాటు తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్నాయి. తుంగభద్ర నది జోగులాంబ గద్వాల జిల్లాలోనే రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అయిజ మండలం కుటకనూర్, రాజాపూర్, పులికల్, వేణిసోంపురం, రాజోలి మండలం పెద్దధన్వాడ, చిన్నధన్వాడ, తుమ్మిళ్ల, రాజోలి, పడమటి గార్లపాడు, తూర్పు గార్లపాడు, మద్దూరు, కొర్విపాడు, మిన్నపాడు, కలుగొట్ల, పుల్లూరు, ఆలంపూర్, గుందిమళ్ల మీదుగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. నదీ పరివాహకంలోని అన్ని గ్రామాల్లోనూ 2008 పుష్కరాలు ఘనంగా జరిగాయి. కుట్కనూరు, పులికల్లు, వేణి సొంపురం, రాజోలి, పుల్లూరు, అలంపూర్‌లో అప్పట్లో ఘాట్లు ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలు, పితృదేవతల పిండ ప్రదానాలు, ఆలయదర్శనాలకు జనం భారీగా వచ్చారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో 2020లో పుష్కరాల నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది.

3 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు

పుష్కరాల నిర్వాహణపై ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మార్గదర్శకాలు, నిధులు విడదల చేయలేదు. దేవాదాయ శాఖ మాత్రం తుంగభద్ర నది పరివాహకంలోని సుమారు 14 ఆలయాల్లో ఆలయ సుందరీకరణ, క్యూలైన్లు, చలువ పందిళ్లు, అన్నప్రసాదాలు, మరమ్మత్తు ఇతర ఏర్పాట్లకు 3 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. కొత్త ఘాట్ల నిర్మాణం, ఉన్న ఘాట్ల మరమ్మత్తులు, రోడ్లు, మంచినీరు సహా ఇతర మౌలిక వసతుల కల్పనపై నీటిపారుదల, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా సహా ఇతర ఏ శాఖల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లలేదు. తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం ఎలా నిర్వహించనుందన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది.

అలంపూర్ నియోజకవర్గంలోనే పుష్కరాలు

రాష్ట్రం పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. శక్తి పీఠం కావడం, జాతీయ రహదారికి అనుకుని రెండు రాష్ట్రాల మధ్య పుల్లూరు ఘాట్లు ఉండటం, అక్కడి ఆలయాల ప్రాశస్త్యం దృష్ట్యా వేల సంఖ్యలో భక్తులు గత పుష్కరాలకు తరలి వస్తారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో... అధికారుల్లోనూ పుష్కరాల నిర్వాహణపై స్పష్టత కరవైంది. ప్రభుత్వం ఆదేశిస్తే కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

పన్నెండేళ్ల ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ప్రవేశించే రాశి ఆధారంగా ఒక్కో నదిని ఒక్కో సమయంలో పుష్కరుడు అవహించి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. బృహస్పతి మకర రాశిలో ప్రవేశిస్తున్న సమయంలో అంటే నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటి వరకు 12 రోజుల పాటు తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్నాయి. తుంగభద్ర నది జోగులాంబ గద్వాల జిల్లాలోనే రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అయిజ మండలం కుటకనూర్, రాజాపూర్, పులికల్, వేణిసోంపురం, రాజోలి మండలం పెద్దధన్వాడ, చిన్నధన్వాడ, తుమ్మిళ్ల, రాజోలి, పడమటి గార్లపాడు, తూర్పు గార్లపాడు, మద్దూరు, కొర్విపాడు, మిన్నపాడు, కలుగొట్ల, పుల్లూరు, ఆలంపూర్, గుందిమళ్ల మీదుగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. నదీ పరివాహకంలోని అన్ని గ్రామాల్లోనూ 2008 పుష్కరాలు ఘనంగా జరిగాయి. కుట్కనూరు, పులికల్లు, వేణి సొంపురం, రాజోలి, పుల్లూరు, అలంపూర్‌లో అప్పట్లో ఘాట్లు ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలు, పితృదేవతల పిండ ప్రదానాలు, ఆలయదర్శనాలకు జనం భారీగా వచ్చారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో 2020లో పుష్కరాల నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది.

3 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు

పుష్కరాల నిర్వాహణపై ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మార్గదర్శకాలు, నిధులు విడదల చేయలేదు. దేవాదాయ శాఖ మాత్రం తుంగభద్ర నది పరివాహకంలోని సుమారు 14 ఆలయాల్లో ఆలయ సుందరీకరణ, క్యూలైన్లు, చలువ పందిళ్లు, అన్నప్రసాదాలు, మరమ్మత్తు ఇతర ఏర్పాట్లకు 3 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. కొత్త ఘాట్ల నిర్మాణం, ఉన్న ఘాట్ల మరమ్మత్తులు, రోడ్లు, మంచినీరు సహా ఇతర మౌలిక వసతుల కల్పనపై నీటిపారుదల, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా సహా ఇతర ఏ శాఖల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లలేదు. తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం ఎలా నిర్వహించనుందన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది.

అలంపూర్ నియోజకవర్గంలోనే పుష్కరాలు

రాష్ట్రం పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. శక్తి పీఠం కావడం, జాతీయ రహదారికి అనుకుని రెండు రాష్ట్రాల మధ్య పుల్లూరు ఘాట్లు ఉండటం, అక్కడి ఆలయాల ప్రాశస్త్యం దృష్ట్యా వేల సంఖ్యలో భక్తులు గత పుష్కరాలకు తరలి వస్తారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో... అధికారుల్లోనూ పుష్కరాల నిర్వాహణపై స్పష్టత కరవైంది. ప్రభుత్వం ఆదేశిస్తే కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.