జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం గూడెందొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ గొంతుకోసుకుని బలవణ్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రాజు, సత్యమ్మకు 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. సత్యమ్మకు పిల్లలు పుట్టి చనిపోతున్నారని భర్త తరచుగా వేధిస్తూ ఉండేవాడు. ఆమె చనిపోతే మరో పెళ్లి చేసుకుంటానని... మానసికంగా హింసించేవాడు. భర్త మాటలతో మనస్తాపం చెందిన సత్యమ్మ ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తిపీటతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిరాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి