ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా - family members of dead women protest in front of gadwal hospital

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భసంచి ఆపరేషన్​ వికటించి.. ఓ మహిళ మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. స్పందించిన పట్టణ ఎస్సై... ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

family-members-of-dead-women-protest-in-front-of-gadwal-hospital
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా
author img

By

Published : May 12, 2020, 12:11 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గర్భసంచి ఆపరేషన్​ వికటించి ఓ మహిళ చనిపోగా.. మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గద్వాలలోని చౌదరపల్లికి చెందిన మహేశ్వరి గర్భసంచి సమస్యతో బాధపడుతోంది. వైద్యుల సూచన మేరకు.. ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆమె పరిస్థతి ఆందోళనకరంగా మారగా.. ఆమెను అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్​ తరలించారు. పరిస్థితి విషమిండం వల్ల ఆమె అక్కడే మృతి చెందింది.

గద్వాల వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహేశ్వరి మరణించిందని ఆరోపిస్తూ.. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహేశ్వరి మృతిపై యాజమాన్యం స్పందించింది. గర్భసంచి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినా... తర్వాత మూత్రాశయంలో ఇన్​ఫెక్షన్​ రావడం వల్ల ఆమెను హైదరాబాద్​కు తీసుకెళ్లాలని సూచించామన్నారు. ఆ తర్వాత ఏమైందో తమకు తెలియదని చెప్పారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గర్భసంచి ఆపరేషన్​ వికటించి ఓ మహిళ చనిపోగా.. మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గద్వాలలోని చౌదరపల్లికి చెందిన మహేశ్వరి గర్భసంచి సమస్యతో బాధపడుతోంది. వైద్యుల సూచన మేరకు.. ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆమె పరిస్థతి ఆందోళనకరంగా మారగా.. ఆమెను అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్​ తరలించారు. పరిస్థితి విషమిండం వల్ల ఆమె అక్కడే మృతి చెందింది.

గద్వాల వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహేశ్వరి మరణించిందని ఆరోపిస్తూ.. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహేశ్వరి మృతిపై యాజమాన్యం స్పందించింది. గర్భసంచి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినా... తర్వాత మూత్రాశయంలో ఇన్​ఫెక్షన్​ రావడం వల్ల ఆమెను హైదరాబాద్​కు తీసుకెళ్లాలని సూచించామన్నారు. ఆ తర్వాత ఏమైందో తమకు తెలియదని చెప్పారు.

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.