ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​కు మాజీ మంత్రి డీకే అరుణ లేఖ

author img

By

Published : Apr 17, 2020, 6:02 PM IST

సీఎం కేసీఆర్​కు మాజీ మంత్రి డీకే అరుణ లేఖ రాశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వెంటనే కరోనా పరీక్షా కేంద్రాలు, వంద పడకల ఐసోలేషన్​ సెంటర్​ను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

DK ARUNA LETTER TO CM KCR FOR ISOLATION WARDS IN GADWALA
ముఖ్యమంత్రి కేసీఆర్​కు మాజీ మంత్రి డీకే అరుణ లేఖ

జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా కట్టడికి పరీక్షా కేంద్రాలు, వంద పడకల ఐసోలేషన్‌ సెంటర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​కు మాజీ మంత్రి డీకే అరుణ లేఖ రాశారు. గద్వాల జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌కు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేసుకోవటంపై ప్రజల్లో చైతన్యం రావడం లేదన్నారు. ప్రజల ఆరోగ్య ఆవశ్యకతను గుర్తించి గద్వాలలో వైద్య పరీక్షా కేంద్రాలు, ఐసోలేషన్‌ సెంటర్‌తో పాటు ఇతర వైద్య సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని లేఖలో డీకే అరుణ కోరారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా కట్టడికి పరీక్షా కేంద్రాలు, వంద పడకల ఐసోలేషన్‌ సెంటర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​కు మాజీ మంత్రి డీకే అరుణ లేఖ రాశారు. గద్వాల జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌కు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేసుకోవటంపై ప్రజల్లో చైతన్యం రావడం లేదన్నారు. ప్రజల ఆరోగ్య ఆవశ్యకతను గుర్తించి గద్వాలలో వైద్య పరీక్షా కేంద్రాలు, ఐసోలేషన్‌ సెంటర్‌తో పాటు ఇతర వైద్య సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని లేఖలో డీకే అరుణ కోరారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.