ETV Bharat / state

మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం

author img

By

Published : Feb 6, 2021, 10:02 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో గందరగోళం చోటుచేసుకుంది. మందకృష్ణ మాదిగకు, రాష్ట్ర పంచాయతీరాజ్​ ట్రిబ్యునల్ ఛైర్మన్ బండారి భాస్కర్​కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.

manda krishna madiga
సభలో గందరగోళం.. మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం

సభలో గందరగోళం.. మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం

జోగులాంబ గద్వాల జిల్లా ర్యాలంపాడు గ్రామంలో బీఆర్​ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. అనంతరం సభలో ప్రసంగిస్తుండగా మధ్యలో మైక్​ను రాష్ట్ర పంచాయతీరాజ్​ ట్రిబ్యునల్ ఛైర్మన్ బండారి భాస్కర్​ లాక్కున్నారు. మందకృష్ణ మాదిగ... తెరాస ప్రభుత్వం వల్ల మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దీనితో మందకృష్ణ, బండారి భాస్కర్​ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. బండారి భాస్కర్​ను సభాస్థలం నుంచి బయటకు తీసుకెళ్లడంతో సభ తిరిగి ప్రారంభమైంది.

ఇవీచూడండి: ' నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్​'

సభలో గందరగోళం.. మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం

జోగులాంబ గద్వాల జిల్లా ర్యాలంపాడు గ్రామంలో బీఆర్​ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. అనంతరం సభలో ప్రసంగిస్తుండగా మధ్యలో మైక్​ను రాష్ట్ర పంచాయతీరాజ్​ ట్రిబ్యునల్ ఛైర్మన్ బండారి భాస్కర్​ లాక్కున్నారు. మందకృష్ణ మాదిగ... తెరాస ప్రభుత్వం వల్ల మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దీనితో మందకృష్ణ, బండారి భాస్కర్​ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. బండారి భాస్కర్​ను సభాస్థలం నుంచి బయటకు తీసుకెళ్లడంతో సభ తిరిగి ప్రారంభమైంది.

ఇవీచూడండి: ' నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.