ETV Bharat / state

పెరిగిన కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పనుల అంచనా వ్యయం

కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీ పనుల అంచనా వ్యయం పెరిగింది. ఈ మేరకు సవరించిన అంచనా వ్యయాలకు నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రతిపాదనలు సమర్పించారు. సవరణ అంచనాలకు స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

author img

By

Published : Dec 25, 2019, 3:11 PM IST

kaleshwaram
kaleshwaram

కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.1,469 కోట్లు పెరిగింది. ఈ మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.6,709 కోట్ల మేర ప్రతిపాదనలను నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు ఇంజినీర్లు సమర్పించారు. గతంలో ఈ పనుల అంచనా రూ.5,240 కోట్లుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంపుహౌస్​ వరకు ఆరో ప్యాకేజీ కిందికి వస్తుంది. ఎల్లంపల్లి నుంచి 2.58 కిమీ అప్రోచ్ కాలువ 1.10 కిమీ గ్రావిటీ కాలువ, 9.53 కిమీ జంట సొరంగాలు.. 7 పంపులతో నిర్మించిన భూగర్భ పంపుహౌస్ పనులు దీని పరిధిలో ఉన్నాయి.

స్టాండింగ్​ కమిటీ ఆమోదం

ఎలక్ట్రికల్ పనుల భూసేకరణకు సంబంధించిన వ్యయాలను గతంలో అంచనా వ్యయంలో కాకుండా ప్రత్యేకంగా చూపారు. మేడారం, వేములూరు గ్రామాల పరిధిలో 4.885 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టారు. ఇవన్నీ కలిపి తాజా సవరణ అంచనాలకు స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నారం బ్యారేజి పనులకు మరోసారి సవరించిన అంచనా వ్యయం రూ.2,795 కోట్లకు స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది. మొదటి అంచనా వ్యయం రూ1,785 కోట్లు.

టెండర్​ ప్రక్రియ ద్వారానే..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో వట్టెం జలాశయంలో బిగించాల్సిన ల్యాబ్​ ఎక్విప్​మెంట్​ను నామినేషన్ విధానంలో కాకుండా.. టెండర్ ప్రక్రియ ద్వారానే కొనుగోలు చేయటానికే కమిటీ మొగ్గు చూపింది. రూ.1.10 కోట్ల విలువ గల ఈ పరికరాలను వట్టెం జలాశయంతో పాటు.. ఈ ఎత్తిపోతల పథకంలోని జలాశయాల్లోనూ బిగించే అవకాశాలు ఉన్నాయి. భీమా ఎత్తిపోతల పథకంలోని 27 ప్యాకేజీ పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారుకు గడువు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న ప్రమాదం

కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.1,469 కోట్లు పెరిగింది. ఈ మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.6,709 కోట్ల మేర ప్రతిపాదనలను నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు ఇంజినీర్లు సమర్పించారు. గతంలో ఈ పనుల అంచనా రూ.5,240 కోట్లుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంపుహౌస్​ వరకు ఆరో ప్యాకేజీ కిందికి వస్తుంది. ఎల్లంపల్లి నుంచి 2.58 కిమీ అప్రోచ్ కాలువ 1.10 కిమీ గ్రావిటీ కాలువ, 9.53 కిమీ జంట సొరంగాలు.. 7 పంపులతో నిర్మించిన భూగర్భ పంపుహౌస్ పనులు దీని పరిధిలో ఉన్నాయి.

స్టాండింగ్​ కమిటీ ఆమోదం

ఎలక్ట్రికల్ పనుల భూసేకరణకు సంబంధించిన వ్యయాలను గతంలో అంచనా వ్యయంలో కాకుండా ప్రత్యేకంగా చూపారు. మేడారం, వేములూరు గ్రామాల పరిధిలో 4.885 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టారు. ఇవన్నీ కలిపి తాజా సవరణ అంచనాలకు స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నారం బ్యారేజి పనులకు మరోసారి సవరించిన అంచనా వ్యయం రూ.2,795 కోట్లకు స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది. మొదటి అంచనా వ్యయం రూ1,785 కోట్లు.

టెండర్​ ప్రక్రియ ద్వారానే..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో వట్టెం జలాశయంలో బిగించాల్సిన ల్యాబ్​ ఎక్విప్​మెంట్​ను నామినేషన్ విధానంలో కాకుండా.. టెండర్ ప్రక్రియ ద్వారానే కొనుగోలు చేయటానికే కమిటీ మొగ్గు చూపింది. రూ.1.10 కోట్ల విలువ గల ఈ పరికరాలను వట్టెం జలాశయంతో పాటు.. ఈ ఎత్తిపోతల పథకంలోని జలాశయాల్లోనూ బిగించే అవకాశాలు ఉన్నాయి. భీమా ఎత్తిపోతల పథకంలోని 27 ప్యాకేజీ పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారుకు గడువు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.