ETV Bharat / state

'ప్రభుత్వాసుపత్రుల్లో 2 నెలలకు సరిపడా మందులుండాలి'

author img

By

Published : Mar 12, 2021, 3:56 PM IST

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రుల్లో.. అవసరమైన మందులను ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు.. అందుబాటులో ఉన్న మందులను పరిశీలించి, వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో పొందుపరచాలని ఆదేశించారు.

jayashankar bhupalapalli collector orderd govt hospitals should have enough medicine for 2 months
'ప్రభుత్వాసుపత్రుల్లో 2 నెలలకు సరిపడా మందులుండాలి'

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాణ్యమైన సేవలందిస్తూ.. అవసరమైన వైద్య పరీక్షలను తప్పకుండా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. జిల్లా వైద్యాధికారికి సూచించారు. రెండు నెలలకు సరిపడా అత్యవసర, సాధారణ మందులను నిల్వ ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ పీహెచ్​సీలలో నూతనంగా నియమితులైన ఫార్మసిస్ట్​లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించారు.

మందుల స్టాక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య పథకాలు, ఆస్పత్రి సిబ్బంది.. ఇతర వివరాలన్ని రికార్డ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని డాటాఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు కలెక్టర్. మందులను, సెలైన్ బాటిళ్లను ఆస్పత్రి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా.. ఫార్మసీ గదిలోనే ఉంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు.. డాక్టర్ మమత, డాక్టర్ ఉమాదేవి, పీహెచ్​సీ వైద్యులు డాక్టర్ రవి, డాక్టర్ జైపాల్, డాక్టర్ గోపీనాథ్, జిల్లా డ్రగ్ స్టోర్ ఇంఛార్జ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 181 కరోనా కేసులు, ఒకరు మృతి

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాణ్యమైన సేవలందిస్తూ.. అవసరమైన వైద్య పరీక్షలను తప్పకుండా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. జిల్లా వైద్యాధికారికి సూచించారు. రెండు నెలలకు సరిపడా అత్యవసర, సాధారణ మందులను నిల్వ ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ పీహెచ్​సీలలో నూతనంగా నియమితులైన ఫార్మసిస్ట్​లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించారు.

మందుల స్టాక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య పథకాలు, ఆస్పత్రి సిబ్బంది.. ఇతర వివరాలన్ని రికార్డ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని డాటాఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు కలెక్టర్. మందులను, సెలైన్ బాటిళ్లను ఆస్పత్రి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా.. ఫార్మసీ గదిలోనే ఉంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు.. డాక్టర్ మమత, డాక్టర్ ఉమాదేవి, పీహెచ్​సీ వైద్యులు డాక్టర్ రవి, డాక్టర్ జైపాల్, డాక్టర్ గోపీనాథ్, జిల్లా డ్రగ్ స్టోర్ ఇంఛార్జ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 181 కరోనా కేసులు, ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.