జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా జెండా పండుగను నిర్వహించారు. జడ్పీ కార్యాలయంలో ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్, పురపాలక కార్యాలయాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జెండాను ఎగరవేశారు. ఎస్పీ భాస్కర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జెండా వందనం చేశారు. తెరాస కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఇవీ చూడండి : ఎర్రకోటపై మోదీకి రెండో అతిపెద్ద ప్రసంగం