హైదరాబాద్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ ధర్నాకు బయలుదేరిన విద్యుత్ ఉద్యోగులను జనగామలోని ప్రధాన చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీ-సెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు ఉద్యోగులు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడాని, తమకు న్యాయం చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం