రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ జిల్లాలోని దేవరుప్పుల, పాలకుర్తి, జఫర్గడ్ మండలాల్లో పర్యటించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన పంటల పొలాలను పరిశీలించారు.
పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్నదాతలెవరూ అధైర్యపడవద్దని, నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.