ETV Bharat / state

అపర భగీరథుడు సీఎం కేసీఆర్​: కడియం శ్రీహరి - jangaon district news

కొండ పోచమ్మ జలాశయంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయిందని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలోని ఎత్తు ప్రదేశాలకు కూడా నీటిని తీసుకొచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్​ అని ఆయన అన్నారు.

kadium srihari spoke about cm kcr in jangaon district
అపర భగీరథుడు సీఎం కేసీఆర్​: కడియం శ్రీహరి
author img

By

Published : May 30, 2020, 6:02 PM IST

గోదావరి జలాలను ఎత్తు ప్రదేశాలకు తీసుకువచ్చి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కొండ పోచమ్మ జలాశయంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాల దోపిడీ జరిగిందని ఆయన అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఒక ధాన్యాగారంగా మారిందని కడియం శ్రీహరి తెలిపారు.

గోదావరి జలాలను ఎత్తు ప్రదేశాలకు తీసుకువచ్చి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కొండ పోచమ్మ జలాశయంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాల దోపిడీ జరిగిందని ఆయన అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఒక ధాన్యాగారంగా మారిందని కడియం శ్రీహరి తెలిపారు.

ఇవీ చూడండి: 'నియంత్రిత సాగు విధానం కాదు.. నిర్బంధ సాగు విధానమే..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.