ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... అతని కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలో సిద్దిపేట-సూర్యాపేట రహదారిపై వనపర్తి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లెకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కాంటూరి రాజు ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. అతని నాలుగేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స నిమిత్తం జనగామ ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: బావా అక్కతో కలిసుండాలి.. అన్నందుకు బావమరిదిని చంపేశాడు