జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గత మూడు రోజుల క్రితం చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ హబ్సిగూడలోని తన నివాసానికి చేరుకున్నట్లు ఆయన సతీమణి పద్మాలతరెడ్డి తెలిపారు. తన నివాసంలో ఆయనతో పాటు... ఆమె హోం క్వారెంటైన్లో ఉన్నట్లు స్పష్టం చేశారు.
తమతో పాటు నిర్ధరణ అయిన మరో ముగ్గురు తమ ఫంక్షన్ హాల్లోని రూముల్లో హోం క్వారెంటైన్లో ఉన్నట్లు చెప్పారు. ఇవాళ వచ్చిన ఫలితాల్లో తమ మరో డ్రైవర్కు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయిందని... తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఆయన సిబ్బందిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇదీ చూడండి: భారత్, చైనా సరిహద్దు వివాదం.. చర్చలతోనే పరిష్కారం