ETV Bharat / state

భర్త జ్ఞాపకాలే ఊపిరిగా... సమాధి వద్దే పెళ్లిరోజు వేడుకలు

author img

By

Published : Mar 4, 2022, 6:16 PM IST

MARRIAGE DAY AT HUSBAND TOMB: జీవితాంతం తోడు నీడగా ఉంటానని పెళ్లినాడు బాసలు చేసిన భర్త ఆరునెలల క్రితం రోడ్డు ప్రమాదంలో దూరమయ్యాడు. ఈ క్రమంలో భర్త జ్ఞాపకాలే ఊపిరిగా జీవిస్తూ ఉంది. గురువారం పెళ్లి రోజు కావడంతో ఆయన సమాధి వద్ద కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్న దయనీయ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

MARRIAGE DAY AT HUSBAND TOMB
సమాధి వద్ద పెళ్లిరోజు వేడుకలు

MARRIAGE DAY AT HUSBAND TOMB: కలకాలం కలిసి ఉంటానని పెళ్లినాడు బాసలు చేసిన భర్తను ఆరునెలల క్రితం రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అయినా భర్త జ్ఞాపకాలే ఊపిరిగా జీవిస్తూ బతుకుతున్నారు. గురువారం పెళ్లిరోజు కావడంతో ఆయన సమాధిని పూలతో అలంకరించి కేక్‌ కట్‌ చేసి పెళ్లి వేడుకలు చేసుకున్నారు. ఈ దయనీయ సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో చోటు చేసుకొంది. ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కదిలించింది.

MARRIAGE DAY AT HUSBAND TOMB
సమాధి వద్ద పెళ్లిరోజు వేడుకలు

భర్త ఎలా మరణించాడంటే...

WEDDING DAY AT HUSBAND TOMB: 2014 మార్చి 3న ప్రవళికకు శేరి సుదర్శన్‌తో వివాహం జరిగింది. తండ్రి అనంత్‌ను దుబాయ్‌ విమానం ఎక్కించేందుకు తన పెద్దనాన్న కొడుకు రాజేందర్‌తో కలిసి సుదర్శన్‌ వెళ్లారు. విమానం ఎక్కించి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో శామీర్‌పేట వద్ద ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. పెళ్లైన నాటి నుంచి ప్రతి సంవత్సరం పెళ్లిరోజు వేడుకలు భార్యభర్తలు ఘనంగా నిర్వహించుకొనేవారు. ఈ ఏడాది కూడా భర్త సమక్షంలోనే జరుపుకోవాలని ఆయన సమాధి వద్ద కేక్ కట్​ చేసింది.

MARRIAGE DAY
భర్త మరణానికి ముందు పెళ్లిరోజు వేడుకలు

ఇదీ చదవండి:'ఇండియా ఫ్లాగ్​ చూసి వదిలిపెట్టారు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్​..'

MARRIAGE DAY AT HUSBAND TOMB: కలకాలం కలిసి ఉంటానని పెళ్లినాడు బాసలు చేసిన భర్తను ఆరునెలల క్రితం రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అయినా భర్త జ్ఞాపకాలే ఊపిరిగా జీవిస్తూ బతుకుతున్నారు. గురువారం పెళ్లిరోజు కావడంతో ఆయన సమాధిని పూలతో అలంకరించి కేక్‌ కట్‌ చేసి పెళ్లి వేడుకలు చేసుకున్నారు. ఈ దయనీయ సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో చోటు చేసుకొంది. ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కదిలించింది.

MARRIAGE DAY AT HUSBAND TOMB
సమాధి వద్ద పెళ్లిరోజు వేడుకలు

భర్త ఎలా మరణించాడంటే...

WEDDING DAY AT HUSBAND TOMB: 2014 మార్చి 3న ప్రవళికకు శేరి సుదర్శన్‌తో వివాహం జరిగింది. తండ్రి అనంత్‌ను దుబాయ్‌ విమానం ఎక్కించేందుకు తన పెద్దనాన్న కొడుకు రాజేందర్‌తో కలిసి సుదర్శన్‌ వెళ్లారు. విమానం ఎక్కించి తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో శామీర్‌పేట వద్ద ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. పెళ్లైన నాటి నుంచి ప్రతి సంవత్సరం పెళ్లిరోజు వేడుకలు భార్యభర్తలు ఘనంగా నిర్వహించుకొనేవారు. ఈ ఏడాది కూడా భర్త సమక్షంలోనే జరుపుకోవాలని ఆయన సమాధి వద్ద కేక్ కట్​ చేసింది.

MARRIAGE DAY
భర్త మరణానికి ముందు పెళ్లిరోజు వేడుకలు

ఇదీ చదవండి:'ఇండియా ఫ్లాగ్​ చూసి వదిలిపెట్టారు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్​..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.