ETV Bharat / state

సడలింపు వేళ జనాలతో కిక్కిరిసిపోయిన రహదారులు

author img

By

Published : May 20, 2021, 11:14 AM IST

నేటి నుంచి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామన్న డీజీపీ మహేందర్​రెడ్డి ప్రకటనతో సడలింపువేళ రోడ్లపై రద్దీ వాతావరణం కనిపించింది. నిత్యావసరాల కొనుగోలు కోసం జనాలు ఒక్కసారిగా బయటకు రావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. భౌతిక దూరం కనుమరుగైన వేళ.. ప్రజల ఉదాసీనతే వైరస్​ వ్యాప్తికి కారణమయ్యేలా ఉంది.

crowd on roads in jagtial
crowd on roads in jagtial

జగిత్యాల పట్టణంలోని రహదారులపై రద్దీ పెరిగింది. కొత్త బస్టాండ్‌, టవర్‌ సర్కిల్‌, పాత మార్కెట్‌, అంగడి బజార్‌ మార్కెట్‌, రైతు బజార్‌, యావర్‌ రోడ్డు ప్రాంతాల్లో జనంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. భౌతిక దూరాన్ని మరచి.. కూరగాయలు, కిరాణా సామగ్రి, ఇతర వస్తువులు కొనేందుకు ప్రజలు ఎగబడ్డారు.

ఉదయం 10 దాటాక నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, రోడ్డుపైకి వస్తే వాహనాలను సీజ్​ చేస్తామని డీజీపీ ప్రకటించడంతో సడలింపు వేళ పెద్దఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. జనాలంతా ఒక్కసారిగా బయటకు వస్తుండటంతో రహదారులపై రద్దీ వాతావరణం ఏర్పడుతోంది. ఫలితంగా భౌతిక దూరం మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: 'వైరస్​ను జయించిన తర్వాత మరింత అప్రమత్తత అవసరం'

జగిత్యాల పట్టణంలోని రహదారులపై రద్దీ పెరిగింది. కొత్త బస్టాండ్‌, టవర్‌ సర్కిల్‌, పాత మార్కెట్‌, అంగడి బజార్‌ మార్కెట్‌, రైతు బజార్‌, యావర్‌ రోడ్డు ప్రాంతాల్లో జనంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. భౌతిక దూరాన్ని మరచి.. కూరగాయలు, కిరాణా సామగ్రి, ఇతర వస్తువులు కొనేందుకు ప్రజలు ఎగబడ్డారు.

ఉదయం 10 దాటాక నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, రోడ్డుపైకి వస్తే వాహనాలను సీజ్​ చేస్తామని డీజీపీ ప్రకటించడంతో సడలింపు వేళ పెద్దఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. జనాలంతా ఒక్కసారిగా బయటకు వస్తుండటంతో రహదారులపై రద్దీ వాతావరణం ఏర్పడుతోంది. ఫలితంగా భౌతిక దూరం మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: 'వైరస్​ను జయించిన తర్వాత మరింత అప్రమత్తత అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.