విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే డా.సంజయ్కుమార్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన కిక్బాక్సింగ్, కరాటే పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు, బెల్టులు ప్రధానం చేశారు. తల్లితండ్రులు పిల్లలకు కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు.
జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానం కార్యక్రమంలో విద్యార్థులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి అభినందించారు. పిల్లలు చిన్న తనంలోనే క్రీడలపై మక్కువ పెంచుకోవాలని పేర్కొన్నారు. శిక్షకులు రామాంజనేయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు స్నేహితులు మృతి