ETV Bharat / state

జగిత్యాల ఇరిగేషన్‌ అధికారులతో.. మంత్రి కొప్పుల సమీక్ష

జగిత్యాల జిల్లాలో  పర్యటించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఇరిగేషన్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని చెరువులను నింపడమే గాక.. నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను గుర్తించి నీరందించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

author img

By

Published : Jul 24, 2020, 10:08 PM IST

minister koppula eshwar meeting with jagitial irigation officers
జగిత్యాల ఇరిగేషన్‌ అధికారులతో.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమీక్ష సమావేశం

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ జగిత్యాల జిల్లాకేంద్రంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఇరిగేషన్​ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు సంజయ్​ కుమార్​, కల్వకుంట్ల విద్యాసాగర్​ రావు, సుంకె రవిశంకర్​, జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు దావ వసంతలతో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువు నుంచి లెఫ్ట్​ కెనాల్​ పూర్తి చేసి.. చెరువులు నింపాలని, జోగాపూర్​ చెరువు నుంచి రుద్రంగి సూరమ్మ చెరువు, మేడిపల్లి, కథలాపూర్​ మండలాలలు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని నీటి పారుదల అధికారులను ఆదేశించారు. జిల్లాలో నీటి పారుదల సమస్యలు లేకుండా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ జగిత్యాల జిల్లాకేంద్రంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఇరిగేషన్​ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు సంజయ్​ కుమార్​, కల్వకుంట్ల విద్యాసాగర్​ రావు, సుంకె రవిశంకర్​, జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు దావ వసంతలతో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువు నుంచి లెఫ్ట్​ కెనాల్​ పూర్తి చేసి.. చెరువులు నింపాలని, జోగాపూర్​ చెరువు నుంచి రుద్రంగి సూరమ్మ చెరువు, మేడిపల్లి, కథలాపూర్​ మండలాలలు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని నీటి పారుదల అధికారులను ఆదేశించారు. జిల్లాలో నీటి పారుదల సమస్యలు లేకుండా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.