జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి ముందు పాత్రికేయులు ధర్నా చేశారు. పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వయసుతో సంబంధం లేకుండా కొవిడ్ టీకాలు ఇవ్వాలని కోరారు.
కరోనాపై అవగాహన కలిగిస్తూ.. ఇబ్బందికర పరిస్థితుల్లో.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న పాత్రికేయులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. అనంతరం తహసీల్ధార్కు వినతి పత్రం ఇచ్చారు.