ETV Bharat / state

ప్రత్యేక బడ్జెట్​ ప్రకటించటంపై ఆర్టీసీ ఉద్యోగుల హర్షం

author img

By

Published : Mar 18, 2021, 8:10 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. ఆర్టీసీ సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్​ ప్రకటించడాన్ని స్వాగతించారు. సీఎం కేసీఆర్​, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు అభిషేకం చేశారు.

ప్రత్యేక బడ్జెట్​ ప్రకటించటంపై ఆర్టీసీ ఉద్యోగుల హర్షం
ప్రత్యేక బడ్జెట్​ ప్రకటించటంపై ఆర్టీసీ ఉద్యోగుల హర్షం

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం అభినందనీయమని జగిత్యాల మెట్​పల్లి డిపో మేనేజర్ విజయ రావు అన్నారు. బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రకటించడాన్ని స్వాగతిస్తూ డిపోలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు ఉద్యోగులు అభిషేకం చేశారు. ఇదే స్ఫూర్తితో ఆర్టీసీని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. తమకు అండగా నిలవాలని కోరారు.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం అభినందనీయమని జగిత్యాల మెట్​పల్లి డిపో మేనేజర్ విజయ రావు అన్నారు. బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రకటించడాన్ని స్వాగతిస్తూ డిపోలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు ఉద్యోగులు అభిషేకం చేశారు. ఇదే స్ఫూర్తితో ఆర్టీసీని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. తమకు అండగా నిలవాలని కోరారు.

ఇదీ చూడండి: ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్‌ రూపకల్పన: హరీశ్‌రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.