ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం అభినందనీయమని జగిత్యాల మెట్పల్లి డిపో మేనేజర్ విజయ రావు అన్నారు. బడ్జెట్ను అసెంబ్లీలో ప్రకటించడాన్ని స్వాగతిస్తూ డిపోలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు ఉద్యోగులు అభిషేకం చేశారు. ఇదే స్ఫూర్తితో ఆర్టీసీని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. తమకు అండగా నిలవాలని కోరారు.
ఇదీ చూడండి: ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన: హరీశ్రావు