ప్రభుత్వం కరోనా వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో కొంతమంది పరిస్థితి విచిత్రంగా ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్డౌన్ నామమాత్రంగానే అమలవుతోంది. సడలింపు సమయంలో జనం రోడ్లపైకి కిక్కిరిసివస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే వీధులన్నీ సందడిగా మారుతున్నాయి. 10 గంటలు దాటినా జనం తగ్గడం లేదు. శుభముహుర్తాలకు అనుకూలమైన రోజులు కావడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మందు అవసరం కావడం వల్ల ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాధి భయం అనేది లేకుండా పోయింది.
మంథని పట్టణంలో వైన్షాపుల ముందు జనం ఎగబడుతున్నారు. ఉదయం 6 గంటలకే షాపులు తెరవాలని ప్రభుత్వం సూచించడంతో మందుబాబులు కూడా అదే సమయంలో వైన్షాపుల వద్దకు వచ్చి 2,3కు మించి మందును కొనుగోలు చేస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యలు సరిగా అమలు కావడం లేదు.
ఓవైపు దేశంలో కరోనాతో వేల మంది చనిపోతుంటే... మందుబాబులు మాత్రం ఏమైతదిలే అంటూ.. ఉదయం నుంచే మందుకోసం ఎగబడుతున్నారు. భౌతికదూరం కూడా పాటించడం లేదు. ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో