ETV Bharat / state

ధాన్యానికి నిప్పు పెట్టి రైతుల నిరసన

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల క్రాస్ రోడ్డుపై వరి ధాన్యానికి నిప్పు పెట్టి రైతులు ఆందోళన నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోయి తాము నష్ట పోయే అవకాశం ఉందని... ఆ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : May 26, 2021, 9:55 PM IST

Farmers protest by setting fire to grain
ధాన్యానికి నిప్పు పెట్టి రైతుల నిరసన

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల క్రాస్ రోడ్డుపై వరి ధాన్యానికి నిప్పు పెట్టి రైతులు నిరసన తెలిపారు. గత 45 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన చెందారు. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి తూకం కోసం ఎదురు చూస్తున్నామని మండిపడ్డారు.

పొలాస వరి వంగడం 24423 ధాన్యం పండించామని అధికారులను సంప్రదించినా… ఫలితం లేకపోయిందని అన్నారు. వర్షాలు పడే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రంలో ఆరు బయట ధాన్యాన్ని నిలువ చేస్తే తడిసి మరింత నష్ట పోతామని వాపోయారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల క్రాస్ రోడ్డుపై వరి ధాన్యానికి నిప్పు పెట్టి రైతులు నిరసన తెలిపారు. గత 45 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన చెందారు. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి తూకం కోసం ఎదురు చూస్తున్నామని మండిపడ్డారు.

పొలాస వరి వంగడం 24423 ధాన్యం పండించామని అధికారులను సంప్రదించినా… ఫలితం లేకపోయిందని అన్నారు. వర్షాలు పడే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రంలో ఆరు బయట ధాన్యాన్ని నిలువ చేస్తే తడిసి మరింత నష్ట పోతామని వాపోయారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: corona: ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు చేస్తున్నాం: డీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.