ETV Bharat / state

మక్కలు కొనుగోలు చేయాలంటూ రహదారిపై బైఠాయింపు

ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతన్నలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : Nov 3, 2020, 6:11 PM IST

Farmers demand to bur popcorn immedietly in sale counters
మక్కలు కొనుగోలు చేయాలంటూ రహదారిపై బైఠాయింపు

మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రధాన రహదారిపై అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించింది.

నిబంధనల పేరిట అధికారులు తక్కువ మొత్తంలో మక్కలు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతన్నలు హెచ్చరించారు.

ఇది చూడండి:ధ‍రణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రధాన రహదారిపై అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించింది.

నిబంధనల పేరిట అధికారులు తక్కువ మొత్తంలో మక్కలు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతన్నలు హెచ్చరించారు.

ఇది చూడండి:ధ‍రణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.