జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 24 మందికి పాజిటివ్ వచ్చిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ధర్మపురిలో కరోనా విజృంభణ, ఒకే రోజు 24మందికి పాజిటివ్
ధర్మపురి పట్టణంలో శుక్రవారం 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల వ్యవధిలో 59 మంది వైరస్ బారిన పడినట్లు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
![ధర్మపురిలో కరోనా విజృంభణ, ఒకే రోజు 24మందికి పాజిటివ్ ధర్మపురిలో కరోనా విజృంభణ, ఒకే ప్రాంతానికి చెందిన 59 మందికి పాజిటివ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8421030-978-8421030-1597416833262.jpg?imwidth=3840)
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ర్యాపిడ్ టెస్టుల ద్వారా పరీక్షలు నిర్వహించగా నాలుగు రోజుల వ్యవధిలో 59మందికి కరోనా సోకిందని తెలిపారు. వారంతా ఒకే వాడకు చెందిన వారు కావడం ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. వైరస బారిన పడిన వారంతా ఇటీవల జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఒకే వారంలో భార్యా, భర్త మృతి.. అనాథలైన పిల్లలు
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 24 మందికి పాజిటివ్ వచ్చిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ర్యాపిడ్ టెస్టుల ద్వారా పరీక్షలు నిర్వహించగా నాలుగు రోజుల వ్యవధిలో 59మందికి కరోనా సోకిందని తెలిపారు. వారంతా ఒకే వాడకు చెందిన వారు కావడం ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. వైరస బారిన పడిన వారంతా ఇటీవల జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఒకే వారంలో భార్యా, భర్త మృతి.. అనాథలైన పిల్లలు