జగిత్యాల జిల్లా మల్యాలలో కాకతీయ కెనాల్ నుంచి లంబాడిపల్లి వరద కాలువ వరకు లింక్ ఏర్పాటు చేస్తే... రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోన్న ప్రభుత్వం కెనాల్ నిర్మాణానికి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం లింక్ కెనాల్కు నిధులను విడుదల చేయలనంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
ఇవీచూడండి: చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్తో ఒప్పందం