ETV Bharat / state

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరుపేదలకు మాస్కుల పంపిణీ

author img

By

Published : May 1, 2021, 7:30 PM IST

జగిత్యాల పట్టణంలో నిరుపేదలకు కాంగ్రెస్​ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ చేశారు. ర్యాలీ నిర్వహిస్తూ మాస్కుల వాడకంపై అవగాహన కల్పించారు.

congress
congress

జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పార్టీ శ్రేణులు జగిత్యాల చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి నిరుపేదలకు మాస్కులను అందజేశారు. మాస్కుల వాడకంపై అవగాహన కల్పించారు.

వైద్యశాలల్లో ప్రభుత్వం కరోనా కిట్లు పెంచాలని.. కేవలం 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించి మిగతా వారిని వెనక్కి పంపుతున్నారని లక్ష్మణ్​ కుమార్​ ఆరోపించారు. పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పార్టీ శ్రేణులు జగిత్యాల చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి నిరుపేదలకు మాస్కులను అందజేశారు. మాస్కుల వాడకంపై అవగాహన కల్పించారు.

వైద్యశాలల్లో ప్రభుత్వం కరోనా కిట్లు పెంచాలని.. కేవలం 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించి మిగతా వారిని వెనక్కి పంపుతున్నారని లక్ష్మణ్​ కుమార్​ ఆరోపించారు. పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: భర్త అంతిమ యాత్రలో ఆగిన భార్య గుండె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.