ETV Bharat / state

రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ - Jagittyala District Latest News

రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక సామరస్యత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా విరాళాలు సేకరించాలని సూచించారు. మెట్‌పల్లిలోని కళానగర్‌ శ్రీశ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Collection of donations for the construction of the Ram Mandir
రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
author img

By

Published : Jan 20, 2021, 11:44 AM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. ఆలయానికి సేకరిస్తున్న విరాళాల కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని కళానగర్‌ శ్రీశ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

ఇంటింటికి తిరుగుతూ అయోధ్య విశిష్టతను వివరిస్తూ విరాళాలు సేకరించారు. 2023లో రామమందిర నిర్మాణం జరగబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరారు.

ఎన్నో ఏళ్ల కల నెరవేర్చుకోవాలని.. వయసుతో నిమిత్తం లేకుండా విరాళాలు సేకరించాలని సూచించారు. బృందాలుగా ఏర్పడి సేకరణ చేపట్టాలని అప్పల ప్రసాద్ అన్నారు.

ఇదీ చూడండి: యాదాద్రికి చేరిన సాలహారాల విగ్రహాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. ఆలయానికి సేకరిస్తున్న విరాళాల కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని కళానగర్‌ శ్రీశ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

ఇంటింటికి తిరుగుతూ అయోధ్య విశిష్టతను వివరిస్తూ విరాళాలు సేకరించారు. 2023లో రామమందిర నిర్మాణం జరగబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరారు.

ఎన్నో ఏళ్ల కల నెరవేర్చుకోవాలని.. వయసుతో నిమిత్తం లేకుండా విరాళాలు సేకరించాలని సూచించారు. బృందాలుగా ఏర్పడి సేకరణ చేపట్టాలని అప్పల ప్రసాద్ అన్నారు.

ఇదీ చూడండి: యాదాద్రికి చేరిన సాలహారాల విగ్రహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.