ETV Bharat / state

వలస కూలీలకు అండగా నిలిచిన భాజపా నాయకుడు

author img

By

Published : May 21, 2021, 7:11 PM IST

జగిత్యాల జిల్లాలో లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు ఓ భాజపా నాయకుడు అండగా నిలిచారు. ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యంతో పాటు నిత్యవసరాలు అందించి గొప్ప మనసును చాటుకున్నారు.

jagithyal
వలస కూలీలను అండగా నిలిచిన భాజపా నాయకుడు

జగిత్యాల జిల్లాలో లాక్ డౌన్ తో ఇబ్బందలు పడుతున్న వలస కార్మికులకు జిల్లా భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మన్నే గంగాధర్ సాయం అందించి ఆదర్శంగా నిలిచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచారు.

మెట్ పల్లి పట్టణంలో ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వలస కార్మికులను గుర్తించి ఒక్కొక్క కూలీకి 50 కిలోల బియ్యం అందించారు. వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను ఇచ్చారు. కరోనా నుంచి రక్షించుకోవడానికి మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. అందరూ తమకు తోచినంత సహాయం చేసి ఈ కష్ట కాలంలో పేదలను ఆదుకోవాలని కోరారు.

జగిత్యాల జిల్లాలో లాక్ డౌన్ తో ఇబ్బందలు పడుతున్న వలస కార్మికులకు జిల్లా భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మన్నే గంగాధర్ సాయం అందించి ఆదర్శంగా నిలిచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచారు.

మెట్ పల్లి పట్టణంలో ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వలస కార్మికులను గుర్తించి ఒక్కొక్క కూలీకి 50 కిలోల బియ్యం అందించారు. వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను ఇచ్చారు. కరోనా నుంచి రక్షించుకోవడానికి మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. అందరూ తమకు తోచినంత సహాయం చేసి ఈ కష్ట కాలంలో పేదలను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: ఉగాండా నుంచి వచ్చి వ్యభిచారం.. మహిళలు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.