ETV Bharat / state

లక్ష గోవుల సంరక్షణే ధ్యేయంగా సెల్ఫీవిత్‌ గోవు - సెల్ఫీ విత్ గోవు

ఐస్ బకెట్, రైస్ బకెట్ ఛాలెంజ్ విన్నాం. చూశాం. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మరో సరికొత్త సవాల్ అందరి దృష్టికిని ఆకర్షిస్తోంది. అదే సెల్ఫీ విత్ గోవు. గోమాత సంరక్షణ కోసం ప్రముఖ సంస్థ యుగ తులసి ఫౌండేషన్... ఈ సవాల్‌ను మొదలుపెట్టింది. లక్ష గోవుల సంరక్షణే ధ్యేయంగా శ్రీకారం చుట్టిన "మేము సైతం గోమాత కోసం" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

yuga thulasi foudation started selfi with cow challenge
yuga thulasi foudation started selfi with cow challenge
author img

By

Published : Aug 16, 2020, 5:13 AM IST

లక్ష గోవుల సంరక్షణే ధ్యేయంగా సెల్ఫీవిత్‌ గోవు

గోవు ఆధారిత దేశంగా పిలుచుకునే భారత్ లో గోమాత సంరక్షణను చేపట్టడమే లక్ష్యంగా ప్రముఖ హిందూ సంస్థ యుగ తులసి ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త పిలుపు నిచ్చింది. కసాయిల చేతుల్లో గోవులు బలి కాకుండా రక్షించేందుకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలనీ... అందుకోసం నేను సైతం గోమాత కోసం అని నినదించాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు విశేష స్పందన లభించింది. గోవుల సంరక్షణలో తమవంతు బాధ్యత చాటుకుంటామంటూ అనేక మంది సెల్ఫీ వీడియోలు తీసి యువ తులసి ఫౌండేషన్‌కు పంపించారు. ఇలా కేవలం 10 రోజుల్లోనే 70 వేల మంది గోమాత రక్షణకు పాటుపడుతామంటూ ముందుకొచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడుగా ప్రమాణస్వీకారం సమయంలో లక్ష గోవుల సంరక్షణ చేపడుతానని ప్రమాణం చేశానని... ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుగ తులసి వ్యవస్థాపకులు శివకుమార్ తెలిపారు. కబేళాలకు తరలిపోతున్న ఆవులను రక్షిస్తూ గోమాతపై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

శివకుమార్ పిలుపునకు స్పందించిన సినీ ప్రముఖులు మోహన్ బాబు, సాయి కుమార్, అల్లు అరవింద్, వీవీ వినాయక్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల సహా జబర్దస్త్ నటీనటులు గో సంరక్షణలో బాధ్యత పంచుకుంటామని తెలిపారు. నేను సైతం గోమాత కోసం కార్యక్రమంతోపాటు గోవుల సంరక్షణ కోసం నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేసేందుకు యుగ తులసి ఫౌండేషన్ సిద్ధమవుతోంది.

ఇవీచూడండి: బామ్మ అభ్యర్థనకు ముగ్ధుడైన మంత్రి...

లక్ష గోవుల సంరక్షణే ధ్యేయంగా సెల్ఫీవిత్‌ గోవు

గోవు ఆధారిత దేశంగా పిలుచుకునే భారత్ లో గోమాత సంరక్షణను చేపట్టడమే లక్ష్యంగా ప్రముఖ హిందూ సంస్థ యుగ తులసి ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త పిలుపు నిచ్చింది. కసాయిల చేతుల్లో గోవులు బలి కాకుండా రక్షించేందుకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలనీ... అందుకోసం నేను సైతం గోమాత కోసం అని నినదించాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు విశేష స్పందన లభించింది. గోవుల సంరక్షణలో తమవంతు బాధ్యత చాటుకుంటామంటూ అనేక మంది సెల్ఫీ వీడియోలు తీసి యువ తులసి ఫౌండేషన్‌కు పంపించారు. ఇలా కేవలం 10 రోజుల్లోనే 70 వేల మంది గోమాత రక్షణకు పాటుపడుతామంటూ ముందుకొచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడుగా ప్రమాణస్వీకారం సమయంలో లక్ష గోవుల సంరక్షణ చేపడుతానని ప్రమాణం చేశానని... ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుగ తులసి వ్యవస్థాపకులు శివకుమార్ తెలిపారు. కబేళాలకు తరలిపోతున్న ఆవులను రక్షిస్తూ గోమాతపై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

శివకుమార్ పిలుపునకు స్పందించిన సినీ ప్రముఖులు మోహన్ బాబు, సాయి కుమార్, అల్లు అరవింద్, వీవీ వినాయక్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల సహా జబర్దస్త్ నటీనటులు గో సంరక్షణలో బాధ్యత పంచుకుంటామని తెలిపారు. నేను సైతం గోమాత కోసం కార్యక్రమంతోపాటు గోవుల సంరక్షణ కోసం నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేసేందుకు యుగ తులసి ఫౌండేషన్ సిద్ధమవుతోంది.

ఇవీచూడండి: బామ్మ అభ్యర్థనకు ముగ్ధుడైన మంత్రి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.