ETV Bharat / state

'బీఆర్​ఎస్​, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం- అందుకే కాళేశ్వరం ఘటనపై కేంద్రం మౌనం'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 1:22 PM IST

YS Sharmila on Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై వైఎస్సార్​​టీపీ అధ్యక్షురాలు తీవ్రంగా స్పందించారు. కమీషన్​ల కోసమే కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరమని విమర్శించారు. బీఆర్​ఎస్​, బీజేపీలు రెండూ ఒకటేనని.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఆ స్వార్థ రాజకీయాల కోసమే కాళేశ్వరం ఘటనపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

YS Sharmila
YS Sharmila on Medigadda Barrage Issue

YS Sharmila on Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ కాక రేపుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు పూర్తి బాధ్యత వహించాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్​​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఈ విషయంపై స్పందించారు. ఘటనపై జాతీయ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో 20 అంశాల మీద సమాచారం అడిగితే.. కేసీఆర్ సర్కార్ 11 అంశాలపై మాత్రమే సమాచారం ఇచ్చిందని షర్మిల ఆరోపించారు. ప్లానింగ్, డిజైనింగ్​లో లోపాలు ఉన్నాయని నివేదికలో కమిటీ.. స్పష్టం చేసిందన్నారు. ఈ బ్యారేజీ కట్టడం అనవసరం, నిరూపయోగమని తేల్చిందని మండిపడ్డారు.

నివేదికలు చూడకుండానే మాపై నిందలా? జాతీయ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌కు రాష్ట్రప్రభుత్వం లేఖ

YS Sharmila on Kaleshwaram Controversy : ప్రస్తుతం బ్యారేజీలో నీరు నింపే అవకాశం లేదని షర్మిల తెలిపారు. భవిష్యత్తులో అన్నారం, సుందిళ్లకూ ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్​ల కోసమే కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టు విలువను కావాలనే పెంచారని.. రూ.లక్ష కోట్లు కేంద్ర ఫైనాన్షియల్ ఇన్​స్టిట్యూషన్స్ నుంచి కాళేశ్వరానికి తీసుకున్నారని చెప్పారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తుందని.. ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయట్లేదని ప్రశ్నించారు.

కమీషన్​ల కోసమే కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రాజెక్టు విలువను కావాలనే పెంచి.. రూ.లక్ష కోట్లు స్వాహా చేశారు. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన ఒకే ఒక్క పార్టీ వైఎస్​ఆర్​టీపీ. ఆరోజు మమ్మల్ని తప్పుబట్టిన వారు.. ఇప్పుడేం మాట్లాడతారు. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది. ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయట్లేదు. బీజేపీ, బీఆర్​ఎస్​​ రెండూ ఒకటే. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉంది. స్వార్థ రాజకీయాల కోసమే కాళేశ్వరం ఘటనపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. - వైఎస్ షర్మిల, వైఎస్సార్​​టీపీ అధ్యక్షురాలు

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ జలాశయాన్ని ఖాళీ చేస్తున్న అధికారులు.. ప్రాజెక్ట్ వద్దకు విపక్షాలకు నో ఎంట్రీ'

కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన ఒకే ఒక్క పార్టీ వైఎస్సార్​​టీపీ అని షర్మిల గుర్తు చేశారు. మొదట్లో తమను తప్పుపట్టిన వారు.. ఇప్పుడేం మాట్లాడతారని నిలదీశారు. బీజేపీ, బీఆర్​ఎస్​ రెండూ ఒకటేనని.. ఆ రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు భారత్​ రాష్ట్ర సమితికి.. బీఆర్​ఎస్​ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండాలన్నదే వారి ఒప్పందమన్నారు. ఈ స్వార్థ రాజకీయాల కోసమే కాళేశ్వరం ఘటనపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని షర్మిల స్పష్టం చేశారు.

Medigadda Barrage in Bhupalpally : "మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు.. కానీ?"

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు.. రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం

YS Sharmila on Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ కాక రేపుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు పూర్తి బాధ్యత వహించాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్​​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఈ విషయంపై స్పందించారు. ఘటనపై జాతీయ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో 20 అంశాల మీద సమాచారం అడిగితే.. కేసీఆర్ సర్కార్ 11 అంశాలపై మాత్రమే సమాచారం ఇచ్చిందని షర్మిల ఆరోపించారు. ప్లానింగ్, డిజైనింగ్​లో లోపాలు ఉన్నాయని నివేదికలో కమిటీ.. స్పష్టం చేసిందన్నారు. ఈ బ్యారేజీ కట్టడం అనవసరం, నిరూపయోగమని తేల్చిందని మండిపడ్డారు.

నివేదికలు చూడకుండానే మాపై నిందలా? జాతీయ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌కు రాష్ట్రప్రభుత్వం లేఖ

YS Sharmila on Kaleshwaram Controversy : ప్రస్తుతం బ్యారేజీలో నీరు నింపే అవకాశం లేదని షర్మిల తెలిపారు. భవిష్యత్తులో అన్నారం, సుందిళ్లకూ ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్​ల కోసమే కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టు విలువను కావాలనే పెంచారని.. రూ.లక్ష కోట్లు కేంద్ర ఫైనాన్షియల్ ఇన్​స్టిట్యూషన్స్ నుంచి కాళేశ్వరానికి తీసుకున్నారని చెప్పారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తుందని.. ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయట్లేదని ప్రశ్నించారు.

కమీషన్​ల కోసమే కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రాజెక్టు విలువను కావాలనే పెంచి.. రూ.లక్ష కోట్లు స్వాహా చేశారు. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన ఒకే ఒక్క పార్టీ వైఎస్​ఆర్​టీపీ. ఆరోజు మమ్మల్ని తప్పుబట్టిన వారు.. ఇప్పుడేం మాట్లాడతారు. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది. ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయట్లేదు. బీజేపీ, బీఆర్​ఎస్​​ రెండూ ఒకటే. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉంది. స్వార్థ రాజకీయాల కోసమే కాళేశ్వరం ఘటనపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. - వైఎస్ షర్మిల, వైఎస్సార్​​టీపీ అధ్యక్షురాలు

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ జలాశయాన్ని ఖాళీ చేస్తున్న అధికారులు.. ప్రాజెక్ట్ వద్దకు విపక్షాలకు నో ఎంట్రీ'

కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన ఒకే ఒక్క పార్టీ వైఎస్సార్​​టీపీ అని షర్మిల గుర్తు చేశారు. మొదట్లో తమను తప్పుపట్టిన వారు.. ఇప్పుడేం మాట్లాడతారని నిలదీశారు. బీజేపీ, బీఆర్​ఎస్​ రెండూ ఒకటేనని.. ఆ రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు భారత్​ రాష్ట్ర సమితికి.. బీఆర్​ఎస్​ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండాలన్నదే వారి ఒప్పందమన్నారు. ఈ స్వార్థ రాజకీయాల కోసమే కాళేశ్వరం ఘటనపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని షర్మిల స్పష్టం చేశారు.

Medigadda Barrage in Bhupalpally : "మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు.. కానీ?"

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు.. రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.