ETV Bharat / state

Non-IT sectors: కరోనా తర్వాత మారుతున్న ధోరణి.. ఐటీయేతర కొలువులకూ జై - telangana news

Non-IT sectors: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో నిపుణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఉద్యోగ మేళా నిర్వహించారు. దీనికి 72 వేల మంది హాజరయ్యారు. దాదాపు 18 వేల మందికి కంపెనీలు ఆఫర్‌ లెటర్లు అందించాయి. ఇందులో ఐటీ రంగంలో 5680 మందికి కొలువులు దక్కగా.. ఐటీయేతర రంగాలలో 5500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వంటి కీలక రంగాల్లో 3800, బ్యాంకింగ్‌లో 900, ఫార్మాలో 600 మందికిపైగా ఉద్యోగాలు లభించాయి.

Non-IT
Non-IT
author img

By

Published : Mar 22, 2022, 6:10 AM IST

Non-IT sectors: ఐటీకి దీటుగా ఐటీయేతర రంగాలు ఉద్యోగాల కల్పనలో దూసుకుపోతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత నియామకాల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఐటీకి దీటుగా ఇతర రంగాలు విస్తరిస్తుండటంతో కొలువులకు ప్రాధాన్యం పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 10-20 శాతం పెరుగుదలతో వేతనాలూ లభిస్తున్నాయి.

ఫార్మా, బీమా రంగాలకు ప్రాధాన్యం..

కరోనా ప్రభావం తర్వాత ఫార్మా, బీమా రంగాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా బయోటెక్నాలజీ, ఫార్మసీ, బయోఫిజిక్స్‌, మైక్రో బయోలజీ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆరోగ్య రక్షణ దృష్ట్యా బీమా రంగానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల నౌకరీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫిబ్రవరిలో బీమా రంగంలో ఉద్యోగాల కల్పన రేటు 74 శాతం పెరిగినట్లు వెల్లడైంది. రిటైల్‌ రంగంలో 64 శాతం, ఐటీ, ఆతిథ్య/పర్యాటక రంగాల్లో 41 శాతం, బ్యాంకింగ్‌/ఫైనాన్స్‌లో 35 శాతం, ఫార్మా విభాగంలో 34 శాతం వృద్ధి రేటు ఉన్నట్లు తేలింది. ‘‘మేం నిర్వహించిన ఉద్యోగ మేళాకు 250 కంపెనీలను ఆహ్వానించాం. 3 వేలకు పైగా ఆఫర్‌ లెటర్లు దక్కాయి. ఫార్మా రంగం బాగా పుంజుకుంది’’ అని సాల్వెక్స్‌ కంపెనీ సీఈవో పి.లక్ష్మీరాయ్‌ వివరించారు.

వేతనాల్లోనూ వ్యత్యాసం..

ఏదైనా ఉద్యోగానికి అనుభవం కీలకం. ఐటీ రంగానికి ఎంపికయ్యే అభ్యర్థుల విషయంలో అదనపు నైపుణ్యాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఐటీయేతర రంగాల్లో ఆ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. జేఎన్‌టీయూలో టాస్క్‌, సాల్వెక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో అనుభవం లేకపోయినా.. నెలకు రూ.15-18 వేలు ప్రారంభ వేతనంతో ఆఫర్‌ లెటర్లను కంపెనీలు ప్రకటించాయి. వేతనానికి తోడు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. వసతి, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, రవాణా సౌకర్యం, ఆహారంలో రాయితీ వంటివి అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.

కీలక రంగాల్లో మార్పు కనిపిస్తోంది..

-జీఆర్‌రెడ్డి హుసిస్‌ కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు

నియామకాల ధోరణిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో ఎక్కువగా అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా చెల్లింపుల విధానంలో మార్పులతో ఈ రంగంలో కొలువులకు ప్రాధాన్యం పెరిగింది. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటుండటంతో డాటా సేకరణ కీలకమవుతోంది. ఫిట్‌నెస్‌, ఆయుర్వేద వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వేతనాలపరంగా 10-20 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

ఐటీకి సమానంగా ఇతర రంగాల్లో అవకాశాలు..

-సుభద్రారాణి, నిపుణ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు

ఐటీకి సమానంగా ఇతర రంగాల్లోనూ ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఇందులోనూ ఐటీ అంటే సాఫ్ట్‌వేర్‌ కొలువులే కాదు.. నాన్‌-ఐటీ కొలువులనూ కంపెనీలు ఇస్తున్నాయి. ఇటీవల ఇంజినీరింగ్‌లోనూ కోర్‌ విభాగాలైన మెకానికల్‌, సివిల్‌ విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతో అవకాశాలూ పెరుగుతున్నాయి. జాబ్‌మేళాలలో ఎఫ్‌ఎంజీ విభాగంలో ఆఫర్స్‌ ఎక్కువగా ఇస్తున్నారు. లైఫ్‌ సైన్సెస్‌ చదువుకున్న విద్యార్థులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కుతున్నాయి.

ఇదీ చూడండి:

Non-IT sectors: ఐటీకి దీటుగా ఐటీయేతర రంగాలు ఉద్యోగాల కల్పనలో దూసుకుపోతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత నియామకాల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఐటీకి దీటుగా ఇతర రంగాలు విస్తరిస్తుండటంతో కొలువులకు ప్రాధాన్యం పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 10-20 శాతం పెరుగుదలతో వేతనాలూ లభిస్తున్నాయి.

ఫార్మా, బీమా రంగాలకు ప్రాధాన్యం..

కరోనా ప్రభావం తర్వాత ఫార్మా, బీమా రంగాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా బయోటెక్నాలజీ, ఫార్మసీ, బయోఫిజిక్స్‌, మైక్రో బయోలజీ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆరోగ్య రక్షణ దృష్ట్యా బీమా రంగానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల నౌకరీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫిబ్రవరిలో బీమా రంగంలో ఉద్యోగాల కల్పన రేటు 74 శాతం పెరిగినట్లు వెల్లడైంది. రిటైల్‌ రంగంలో 64 శాతం, ఐటీ, ఆతిథ్య/పర్యాటక రంగాల్లో 41 శాతం, బ్యాంకింగ్‌/ఫైనాన్స్‌లో 35 శాతం, ఫార్మా విభాగంలో 34 శాతం వృద్ధి రేటు ఉన్నట్లు తేలింది. ‘‘మేం నిర్వహించిన ఉద్యోగ మేళాకు 250 కంపెనీలను ఆహ్వానించాం. 3 వేలకు పైగా ఆఫర్‌ లెటర్లు దక్కాయి. ఫార్మా రంగం బాగా పుంజుకుంది’’ అని సాల్వెక్స్‌ కంపెనీ సీఈవో పి.లక్ష్మీరాయ్‌ వివరించారు.

వేతనాల్లోనూ వ్యత్యాసం..

ఏదైనా ఉద్యోగానికి అనుభవం కీలకం. ఐటీ రంగానికి ఎంపికయ్యే అభ్యర్థుల విషయంలో అదనపు నైపుణ్యాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఐటీయేతర రంగాల్లో ఆ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. జేఎన్‌టీయూలో టాస్క్‌, సాల్వెక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో అనుభవం లేకపోయినా.. నెలకు రూ.15-18 వేలు ప్రారంభ వేతనంతో ఆఫర్‌ లెటర్లను కంపెనీలు ప్రకటించాయి. వేతనానికి తోడు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. వసతి, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, రవాణా సౌకర్యం, ఆహారంలో రాయితీ వంటివి అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.

కీలక రంగాల్లో మార్పు కనిపిస్తోంది..

-జీఆర్‌రెడ్డి హుసిస్‌ కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు

నియామకాల ధోరణిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో ఎక్కువగా అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా చెల్లింపుల విధానంలో మార్పులతో ఈ రంగంలో కొలువులకు ప్రాధాన్యం పెరిగింది. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటుండటంతో డాటా సేకరణ కీలకమవుతోంది. ఫిట్‌నెస్‌, ఆయుర్వేద వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వేతనాలపరంగా 10-20 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

ఐటీకి సమానంగా ఇతర రంగాల్లో అవకాశాలు..

-సుభద్రారాణి, నిపుణ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు

ఐటీకి సమానంగా ఇతర రంగాల్లోనూ ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఇందులోనూ ఐటీ అంటే సాఫ్ట్‌వేర్‌ కొలువులే కాదు.. నాన్‌-ఐటీ కొలువులనూ కంపెనీలు ఇస్తున్నాయి. ఇటీవల ఇంజినీరింగ్‌లోనూ కోర్‌ విభాగాలైన మెకానికల్‌, సివిల్‌ విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతో అవకాశాలూ పెరుగుతున్నాయి. జాబ్‌మేళాలలో ఎఫ్‌ఎంజీ విభాగంలో ఆఫర్స్‌ ఎక్కువగా ఇస్తున్నారు. లైఫ్‌ సైన్సెస్‌ చదువుకున్న విద్యార్థులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కుతున్నాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.