ETV Bharat / state

ఘనంగా క్రిస్మస్​ వేడుకలు... శోభాయమానంగా చర్చిలు

author img

By

Published : Dec 25, 2020, 4:31 AM IST

Updated : Dec 25, 2020, 6:47 AM IST

రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు ఉత్సాహంగా సంబురాలు చేసుకుంటున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ నడుమ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సామూహిక ప్రార్థనలు... ఏసు గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఘనంగా క్రిస్మస్​ వేడుకలు... శోభాయమానంగా చర్చిలు
ఘనంగా క్రిస్మస్​ వేడుకలు... శోభాయమానంగా చర్చిలు
ఘనంగా క్రిస్మస్​ వేడుకలు... శోభాయమానంగా చర్చిలు

రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్రిస్మస్‌ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్‌ దీపాల అలంకరణతో చర్చిలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి. పలు చర్చిల్లో రాత్రి నుంచే క్రిస్మస్‌ సంబురాలు మొదలయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన క్రిస్టియన్లు ఆహ్లాదంగా సంబురాలు చేసుకున్నారు. పాస్టర్లు, బిషప్‌లు ఏసు బోధనలను తెలియజేశారు. ఏసు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. ప్రార్థనలు, భక్తి గీతాల ఆలాపన మధ్య వేడుకలు మనోహరంగా సాగాయి.

విద్యుత్​దీపాల కాంతుల్లో..

సికింద్రాబాద్‌ సెయింట్‌మేరీ, వెస్లీ చర్చిలలో సంబరాలు అంబరాన్నంటాయి. క్రిస్మస్‌ వేడుకల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకూ సంబురాలు సాగాయి. మళ్లీ తెల్లవారుజామునుంచే చర్చిలకు వచ్చారు. కూకట్‌పల్లిలోని ట్రినిటీ చర్చి విద్యుత్‌ దీపాల అలంకరణతో కాంతులీనింది. చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది.

మెదక్​లో చూడముచ్చటగా..

క్రిస్మస్‌ను పురస్కరించుకుని మెదక్ చర్చిని విద్యుత్‌ దీపాలతో అందంగా ము‌స్తాబుచేశారు. క్రిస్మస్ ట్రీని చూడముచ్చటగా అలంకరించారు. వరంగల్‌, సంగారెడ్డి జహీరాబాద్‌లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఇదీ చూడండి: క్రిస్మస్ వెలుగులు... రంగురంగుల విద్యుత్ కాంతులు

ఘనంగా క్రిస్మస్​ వేడుకలు... శోభాయమానంగా చర్చిలు

రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్రిస్మస్‌ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్‌ దీపాల అలంకరణతో చర్చిలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి. పలు చర్చిల్లో రాత్రి నుంచే క్రిస్మస్‌ సంబురాలు మొదలయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన క్రిస్టియన్లు ఆహ్లాదంగా సంబురాలు చేసుకున్నారు. పాస్టర్లు, బిషప్‌లు ఏసు బోధనలను తెలియజేశారు. ఏసు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. ప్రార్థనలు, భక్తి గీతాల ఆలాపన మధ్య వేడుకలు మనోహరంగా సాగాయి.

విద్యుత్​దీపాల కాంతుల్లో..

సికింద్రాబాద్‌ సెయింట్‌మేరీ, వెస్లీ చర్చిలలో సంబరాలు అంబరాన్నంటాయి. క్రిస్మస్‌ వేడుకల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకూ సంబురాలు సాగాయి. మళ్లీ తెల్లవారుజామునుంచే చర్చిలకు వచ్చారు. కూకట్‌పల్లిలోని ట్రినిటీ చర్చి విద్యుత్‌ దీపాల అలంకరణతో కాంతులీనింది. చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది.

మెదక్​లో చూడముచ్చటగా..

క్రిస్మస్‌ను పురస్కరించుకుని మెదక్ చర్చిని విద్యుత్‌ దీపాలతో అందంగా ము‌స్తాబుచేశారు. క్రిస్మస్ ట్రీని చూడముచ్చటగా అలంకరించారు. వరంగల్‌, సంగారెడ్డి జహీరాబాద్‌లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఇదీ చూడండి: క్రిస్మస్ వెలుగులు... రంగురంగుల విద్యుత్ కాంతులు

Last Updated : Dec 25, 2020, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.