ETV Bharat / state

'అతని నుంచి ప్రాణహాని ఉంది... పోలీసులు కేసు నమోదు చేయట్లేదు'

author img

By

Published : Nov 20, 2020, 6:45 AM IST

బోరబండ డివిజన్ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దాడి చేసేందుకు యత్నించారని ఆరోపిస్తూ.. ఓ మహిళ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

women-allegations-on-trs-candidate-in-borabanda
'అతని నుంచి ప్రాణహాని ఉంది... పోలీసులు కేసు నమోదు చేయట్లేదు'

బోరబండలో స్థానికంగా నివాసముంటున్న షర్మిల జాదవ్ అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. బోరబండ డివిజన్ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్​ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.

గతంలో కూడా ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడ్డరంటూ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వక్తం చేశారు. కేసు నమోదు చేసి ఫసియుద్దీన్‌ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బోరబండలో స్థానికంగా నివాసముంటున్న షర్మిల జాదవ్ అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. బోరబండ డివిజన్ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్​ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.

గతంలో కూడా ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడ్డరంటూ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వక్తం చేశారు. కేసు నమోదు చేసి ఫసియుద్దీన్‌ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: 'వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.