కర్ణాటక నుంచి తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తు దాకా ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లక్షదీవుల ప్రాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా 109 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" గీతానికి ప్రధాని అభినందనలు