ETV Bharat / state

RAINS: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు - telangana news

కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని... వాటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ సంచాలకురాలు డాక్టర్​ నాగరత్న తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు నమోదైనట్లు వెల్లడించారు.

RAINS
RAINS: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు
author img

By

Published : Jun 3, 2021, 3:19 PM IST

నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24గంటల్లో కేరళలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

RAINS: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు

అత్యధికంగా పోచంపల్లిలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేరళకు నైరుతి రుతుపవనాలు- జోరుగా వర్షాలు

నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24గంటల్లో కేరళలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

RAINS: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు

అత్యధికంగా పోచంపల్లిలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేరళకు నైరుతి రుతుపవనాలు- జోరుగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.