హైదరాబాద్లోని స్థానిక మధురానగర్లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రజలకు ఆధ్యాత్మిక తత్వం గురించి హిత బోధనలు చేశారు. సదస్సుకు ఈటీవీ చీఫ్ ఇంజినీర్ ఎస్ఎల్ కే ప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లింగేశ్వరరావు, జస్టిస్ నాగ మారుతి, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య మసన చెన్నప్ప పాల్గొన్నారు.
తల్లిని గౌరవించాలి
సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం అలవర్చుకోవాలని ఫీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. జన్మనిచ్చిన తల్లిని అందరూ గౌరవించాలని బోధించారు. కులమతాలకు అతీతంగా ఈ పీఠం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడిచి... సనాతన ధార్మిక సిద్ధాంతం కొరకు పాటు పడాలని సూచించారు. ట్రస్టు చేస్తోన్న సేవలను వివరించారు.
ఇదీ చూడండి : 'అమ్మలు అందరూ స్ఫూర్తిప్రదాతలే....'