ETV Bharat / state

Vinod Kumar Comments On Modi : 'ఓవర్‌ హాలింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు.. ప్రధాని రావడమేంటి!.. అక్కడ ఏం చేస్తారో తెలుసా?'

author img

By

Published : Jun 29, 2023, 8:33 PM IST

Vinod Kumar Comments On Modi Foundation of Kazipet Overhauling Center : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాజీపేట ఓవర్​ హాలింగ్​ సెంటర్​కు శంకుస్థాపన చేయడానికి రావడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ సెటైర్లు వేశారు. కాజీపేటకు కోచ్​​ ఫ్యాక్టరీ ఆలస్యంపై గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. గత 40 ఏళ్లుగా ఈ విషయంపై గళాన్ని వినిపిస్తూనే ఉంటున్నామని చెప్పారు.

vinod kumar
vinod kumar

Vinod Kumar Comments On Modi Telangana Tour : జులై 8న ప్రధానమంత్రి వరంగల్​లో కాజీపేట ఓవర్​ హాలింగ్​ సెంటర్​కు శంకుస్థాపన చేయడానికి రావడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో కాజీపేటకు రావాల్సిన కోచ్​ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించారని కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. హైదరాబాద్​లో ప్రత్యేకంగా ఇదే విషయంపై సమావేశం నిర్వహించి ఆయన​ మాట్లాడారు.

కాజీపేటకు కోచ్​​ ఫ్యాక్టరీ ఆలస్యంపై గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ తెలిపారు. ఈ కోచ్​ ఫ్యాక్టరీని ఇస్తామని చెప్పి.. నాటి ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేశారు. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కోచ్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదని చెప్పారు. కాజీపేటకు కేటాయించాల్సిన ఫ్యాక్టరీని.. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి స్వరాష్ట్రానికి తరలించేశారని ఆరోపించారు. తెలంగాణలో రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ కావాలనేది ఇప్పటి నాటి డిమాండ్​ కాదు.. దాదాపు 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.

Vinod Kumar Fire On Modi : జులై 8న కాజీపేటలోని ఓవర్​ హాలింగ్​ సెంటర్​కు శంకుస్థాపన చేయడానికి.. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీనే రావడం ఆశ్చర్యకరంగా ఉందని వినోద్​ కుమార్​ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ పీరియాడికల్​ ఓవర్​ హాలింగ్​ సెంటర్​లో భాగంగా కేవలం వ్యాగన్లు శుభ్రం, మరమ్మతులు మాత్రమే చేస్తారని తెలిపారు. దీనికి కూడా ప్రధాని రావాలా అని ఎద్దేవా చేశారు. కాజీ పేటకు కోచ్​ ఫ్యాక్టరీని ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన చట్టంలోనే ఉందని ఆయన వివరించారు.

"ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్​కు వచ్చి కాజీపేటలో కడుతున్న ఓవర్​ హాలింగ్​ వర్క్​ షాపుకు శంకుస్థాపన చేస్తారని, మెగా టెక్స్​ టైల్​ పార్క్​ శంకుస్థాపన, భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని విన్నాను. కాజీ పేటలో రైల్​ కోచ్​ ఫ్యాక్టరీ కోసం గత 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాము. ఓవర్​ హాలింగ్​ వర్క్​ షాపు రిపేరులు చేసే దానికి శంకుస్థాపన చేయడం ఆశ్చర్యంగా ఉంది. విభజన హామీలో ఉన్న కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలి. గత ఎన్నికల సందర్భంగా కర్ణాటక, గుజరాత్​లకు ఈ కోచ్​ ఫ్యాక్టరీలను తరలించారు." - వినోద్​ కుమార్​, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు

ఎన్నికలకు ఆ రెండు రాష్ట్రాలకు కోచ్​ ఫ్యాక్టరీ తరలింపు : దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ.. 2018లో మహారాష్ట్రలో కోచ్​​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వివరాలు తెలిపారు. గతేడాది ఎన్నికల సందర్భంగా గుజరాత్​లో మోదీ కోచ్​ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి.. రూ.20 వేల కోట్లతో అక్కడ కోచ్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో ఉన్నా.. కాజీపేటలో కాకుండా మరోచోట ఏర్పాటు చేయడం.. బీజేపీ సిగ్గుచేటు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ అనేది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని వినోద్​ కుమార్​ తెలియజేశారు. కాజీపేట రైల్వే కోచ్​ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఓవర్‌ హాలింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు.. ప్రధాని రావడమేంటి

ఇవీ చదవండి :

Vinod Kumar Comments On Modi Telangana Tour : జులై 8న ప్రధానమంత్రి వరంగల్​లో కాజీపేట ఓవర్​ హాలింగ్​ సెంటర్​కు శంకుస్థాపన చేయడానికి రావడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో కాజీపేటకు రావాల్సిన కోచ్​ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించారని కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. హైదరాబాద్​లో ప్రత్యేకంగా ఇదే విషయంపై సమావేశం నిర్వహించి ఆయన​ మాట్లాడారు.

కాజీపేటకు కోచ్​​ ఫ్యాక్టరీ ఆలస్యంపై గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ తెలిపారు. ఈ కోచ్​ ఫ్యాక్టరీని ఇస్తామని చెప్పి.. నాటి ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేశారు. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కోచ్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదని చెప్పారు. కాజీపేటకు కేటాయించాల్సిన ఫ్యాక్టరీని.. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి స్వరాష్ట్రానికి తరలించేశారని ఆరోపించారు. తెలంగాణలో రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ కావాలనేది ఇప్పటి నాటి డిమాండ్​ కాదు.. దాదాపు 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.

Vinod Kumar Fire On Modi : జులై 8న కాజీపేటలోని ఓవర్​ హాలింగ్​ సెంటర్​కు శంకుస్థాపన చేయడానికి.. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీనే రావడం ఆశ్చర్యకరంగా ఉందని వినోద్​ కుమార్​ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ పీరియాడికల్​ ఓవర్​ హాలింగ్​ సెంటర్​లో భాగంగా కేవలం వ్యాగన్లు శుభ్రం, మరమ్మతులు మాత్రమే చేస్తారని తెలిపారు. దీనికి కూడా ప్రధాని రావాలా అని ఎద్దేవా చేశారు. కాజీ పేటకు కోచ్​ ఫ్యాక్టరీని ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన చట్టంలోనే ఉందని ఆయన వివరించారు.

"ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్​కు వచ్చి కాజీపేటలో కడుతున్న ఓవర్​ హాలింగ్​ వర్క్​ షాపుకు శంకుస్థాపన చేస్తారని, మెగా టెక్స్​ టైల్​ పార్క్​ శంకుస్థాపన, భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని విన్నాను. కాజీ పేటలో రైల్​ కోచ్​ ఫ్యాక్టరీ కోసం గత 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాము. ఓవర్​ హాలింగ్​ వర్క్​ షాపు రిపేరులు చేసే దానికి శంకుస్థాపన చేయడం ఆశ్చర్యంగా ఉంది. విభజన హామీలో ఉన్న కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలి. గత ఎన్నికల సందర్భంగా కర్ణాటక, గుజరాత్​లకు ఈ కోచ్​ ఫ్యాక్టరీలను తరలించారు." - వినోద్​ కుమార్​, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు

ఎన్నికలకు ఆ రెండు రాష్ట్రాలకు కోచ్​ ఫ్యాక్టరీ తరలింపు : దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ.. 2018లో మహారాష్ట్రలో కోచ్​​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వివరాలు తెలిపారు. గతేడాది ఎన్నికల సందర్భంగా గుజరాత్​లో మోదీ కోచ్​ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి.. రూ.20 వేల కోట్లతో అక్కడ కోచ్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో ఉన్నా.. కాజీపేటలో కాకుండా మరోచోట ఏర్పాటు చేయడం.. బీజేపీ సిగ్గుచేటు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ అనేది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని వినోద్​ కుమార్​ తెలియజేశారు. కాజీపేట రైల్వే కోచ్​ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఓవర్‌ హాలింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు.. ప్రధాని రావడమేంటి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.