ETV Bharat / state

లాక్​డౌన్​లో రోడ్డుమీదకొస్తే.. వాహనం సీజ్

దేశవ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో భాగంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ప్రతిరోజూ.. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్​ కమిషనరేట్లలో వేల వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. వాహనం సీజ్‌ అయిందా ఇక అంతే... అది మళ్లి వాహనదారుడి చేతికి వచ్చే సరికి దాని స్వరూపం మారిపోయే అవకాశాలున్నాయి.

author img

By

Published : Apr 28, 2020, 7:39 PM IST

vehicles seized in lockdown period
లాక్​డౌన్​లో రోడ్డుమీదకొస్తే.. వాహనం సీజ్

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తరుణంలో నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సీజ్‌ చేసిన వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లలో, చెక్‌పోస్టుల వద్ద ఉంచుతున్నారు. రోజుల తరబడి అవి అక్కడే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు లక్షన్నర వరకు వాహనాలను పోలీసులు జప్తు చేశారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తే తప్పా... వాటికి మోక్షం లభించే అవకాశం లేదు. ఆంక్షలను సడలించిన తర్వాత ఆయా ఠాణాల పోలీసులు వాటిని న్యాయస్థానాల్లో డిపాజిట్‌ చేయనున్నారు.

జరిమానా చెల్లించిన తర్వాతే..

అంటువ్యాధుల వ్యాప్తి నిరోధక చట్టం కింద రూ. 500 నుంచి 2,000 వరకు జరిమానా చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి తీసుకోవచ్చు. సగటున రూ. 1000 అనుకున్నా ఇదే దాదాపు రూ.14.6 కోట్లు కానుంది. దీనికి తోడు రోజుల తరబడి ఒకే చోట కదలకుండా ఉండటం వల్ల వేలల్లో మరమ్మతుల భారం అదనం అయ్యే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో అనవసరంగా బయటికి వెళ్లి వాహనాన్ని పోలీసులకు సమర్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

1,46,894 వాహనాలు సీజ్‌..

సాధారణంగా వాహనాలు ఒకే చోట కదలకుండా ఉండటం వల్ల బ్యాటరీ డౌన్‌ అవుతుంది. దాన్ని రీఛార్జి చేసేందుకు కారుకైతే రూ. 300, ద్విచక్ర వాహనానికైతే రూ.100 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. పాత బ్యాటరీ అయితే పూర్తిగా చెడిపోతుంది. లాక్‌డౌన్‌ మొదలు నుంచి ఈనెల 23 వరకు ఐపీసీ సెక్షన్ల కింద మొత్తం 12,582 కేసులు నమోదు చేశారు. 1,46,894 వాహనాలను సీజ్‌ చేశారు. వీటిలో ద్విచక్ర వాహనాలు 1,35,934 కాగా ఆటోలు 5,660, కార్లు 4,696, ఇతర వాహనాలు 604 ఉన్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి రావద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: '200 కిలోమీటర్లు... 6 ఆసుపత్రులు... దరిచేరని తల్లి ప్రయాణం'

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తరుణంలో నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సీజ్‌ చేసిన వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లలో, చెక్‌పోస్టుల వద్ద ఉంచుతున్నారు. రోజుల తరబడి అవి అక్కడే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు లక్షన్నర వరకు వాహనాలను పోలీసులు జప్తు చేశారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తే తప్పా... వాటికి మోక్షం లభించే అవకాశం లేదు. ఆంక్షలను సడలించిన తర్వాత ఆయా ఠాణాల పోలీసులు వాటిని న్యాయస్థానాల్లో డిపాజిట్‌ చేయనున్నారు.

జరిమానా చెల్లించిన తర్వాతే..

అంటువ్యాధుల వ్యాప్తి నిరోధక చట్టం కింద రూ. 500 నుంచి 2,000 వరకు జరిమానా చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి తీసుకోవచ్చు. సగటున రూ. 1000 అనుకున్నా ఇదే దాదాపు రూ.14.6 కోట్లు కానుంది. దీనికి తోడు రోజుల తరబడి ఒకే చోట కదలకుండా ఉండటం వల్ల వేలల్లో మరమ్మతుల భారం అదనం అయ్యే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో అనవసరంగా బయటికి వెళ్లి వాహనాన్ని పోలీసులకు సమర్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

1,46,894 వాహనాలు సీజ్‌..

సాధారణంగా వాహనాలు ఒకే చోట కదలకుండా ఉండటం వల్ల బ్యాటరీ డౌన్‌ అవుతుంది. దాన్ని రీఛార్జి చేసేందుకు కారుకైతే రూ. 300, ద్విచక్ర వాహనానికైతే రూ.100 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. పాత బ్యాటరీ అయితే పూర్తిగా చెడిపోతుంది. లాక్‌డౌన్‌ మొదలు నుంచి ఈనెల 23 వరకు ఐపీసీ సెక్షన్ల కింద మొత్తం 12,582 కేసులు నమోదు చేశారు. 1,46,894 వాహనాలను సీజ్‌ చేశారు. వీటిలో ద్విచక్ర వాహనాలు 1,35,934 కాగా ఆటోలు 5,660, కార్లు 4,696, ఇతర వాహనాలు 604 ఉన్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి రావద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: '200 కిలోమీటర్లు... 6 ఆసుపత్రులు... దరిచేరని తల్లి ప్రయాణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.