హైదరాబాద్ కూకట్పల్లిలోని హైవేపై పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా అందరూ ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వ ఆదేశాన్ని బేఖాతరు చేస్తోన్నవారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆటోలు, టాక్సీలు నడుపుతున్న వారిపై దృష్టి సారించారు.
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో పోలీసులు వాహనాలను నిలిపివేశారు. అత్యవసరంగా ప్రయాణం చేస్తున్న వాహనాలకు మాత్రం అనుమతించారు. 30కిపైగా ఆటోలు, క్యాబ్లను అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇళ్లకే పరిమితమవ్వాలని సీఐ లక్ష్మీనారాయణ కోరారు.
ఇవీ చూడండి : సొంత వాహనాల్లో గ్రామాలకు వెళితే అనుమతిస్తాం: ఈటల