ETV Bharat / state

రెండోరోజూ జోరుగా వ్యాక్సినేషన్‌... ప్రతి కేంద్రంలో 50 మందికి టీకాలు

author img

By

Published : Jan 19, 2021, 5:20 AM IST

రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఆసుపత్రులు, పీహెచ్​సీల్లో టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. తొలి రోజు 30మంది చొప్పున ప్రారంభించి.. రెండో రోజు 50 మందికి పెంచిన ఆరోగ్యశాఖ... ఇకపై కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తోంది. రానున్న రోజుల్లో రోజుకు కనీసం లక్షడోసులు పంపిణీ చేయాలని యోచిస్తోంది.

రెండోరోజూ జోరుగా వ్యాక్సినేషన్‌... ప్రతి కేంద్రంలో 50 మందికి టీకాలు
రెండోరోజూ జోరుగా వ్యాక్సినేషన్‌... ప్రతి కేంద్రంలో 50 మందికి టీకాలు
రెండోరోజూ జోరుగా వ్యాక్సినేషన్‌... ప్రతి కేంద్రంలో 50 మందికి టీకాలు

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేట యూపీహెచ్​సీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వ్యాక్సినేషన్‌ను శ్రీకారం చుట్టారు.

30 నుంచి 50...

తొలిరోజు వరంగల్ జిల్లావ్యాప్తంగా 21 కేంద్రాల్లో టీకా వేయగా... రెండో రోజు 45 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 7 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొదటిరోజు ఉమ్మడి జిల్లాలో 10 కేంద్రాల్లో టీకాలు వేయగా.. రెండో రోజు 21 కేంద్రాలకు విస్తరించారు. ప్రతి కేంద్రంలో 30 నుంచి 50 మంది వరకు టీకా ఇస్తున్నారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు...

కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాకినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు... హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్, గద్వాల జిల్లా ఐజలో అబ్రహం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.

పలు జిల్లాల్లో...

టీకాలు వేసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు పూర్తయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. బయ్యారం పీహెచ్​సీలో ఎమ్మెల్యే హరిప్రియ, కేసముద్రం పీహెచ్​సీలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ శశాంక పరిశీలించారు.

జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో సోమవారం 8 ఆరోగ్య కేంద్రాలలో 400 మంది వైద్యసిబ్బందికి టీకాలిచ్చారు. మేడ్చల్ జిల్లా షాపూర్​నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న ఇద్దరు అంగన్‌వాడీ సహాయ కార్యకర్తలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

నేటి నుంచి 1,034 కేంద్రాల్లో...

తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండోరోజు 335 కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేయగా... నేటి నుంచి 1,034 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని కేంద్రాల్లోనూ రోజుకూ కనీసం 100 మందికి పంపిణీ చేయడానికి సన్నాహాలు చేసింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.

ఈనెల 25 నుంచి...

టీకాల పంపిణీ లక్ష్యానికి తగ్గట్లుగా అన్ని జిల్లా కేంద్ర గిడ్డంగులతో పాటు రాష్ట్రంలోని 866 కోల్డ్‌ చైన్‌ పాయింట్లకు... లక్ష 70 వేల డోసుల వ్యాక్సిన్ల సరఫరాకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర కార్యాలయం నుంచి ముందుగా జిల్లాలకు, అక్కడి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని కోల్డ్‌ చైన్‌ పాయింట్లకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అటు ఈనెల 25 నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యసిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఇవీ చదవండి :

వ్యాక్సినేషన్ సక్సెస్... కిష్టమ్మకు తొలిటీకా

కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!

'వ్యాక్సినేషన్ విజయవంతం... సీఎం కృషి అభినందనీయం'

రెండోరోజూ జోరుగా వ్యాక్సినేషన్‌... ప్రతి కేంద్రంలో 50 మందికి టీకాలు

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేట యూపీహెచ్​సీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వ్యాక్సినేషన్‌ను శ్రీకారం చుట్టారు.

30 నుంచి 50...

తొలిరోజు వరంగల్ జిల్లావ్యాప్తంగా 21 కేంద్రాల్లో టీకా వేయగా... రెండో రోజు 45 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 7 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొదటిరోజు ఉమ్మడి జిల్లాలో 10 కేంద్రాల్లో టీకాలు వేయగా.. రెండో రోజు 21 కేంద్రాలకు విస్తరించారు. ప్రతి కేంద్రంలో 30 నుంచి 50 మంది వరకు టీకా ఇస్తున్నారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు...

కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాకినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు... హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్, గద్వాల జిల్లా ఐజలో అబ్రహం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.

పలు జిల్లాల్లో...

టీకాలు వేసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు పూర్తయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. బయ్యారం పీహెచ్​సీలో ఎమ్మెల్యే హరిప్రియ, కేసముద్రం పీహెచ్​సీలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ శశాంక పరిశీలించారు.

జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో సోమవారం 8 ఆరోగ్య కేంద్రాలలో 400 మంది వైద్యసిబ్బందికి టీకాలిచ్చారు. మేడ్చల్ జిల్లా షాపూర్​నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న ఇద్దరు అంగన్‌వాడీ సహాయ కార్యకర్తలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

నేటి నుంచి 1,034 కేంద్రాల్లో...

తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండోరోజు 335 కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేయగా... నేటి నుంచి 1,034 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని కేంద్రాల్లోనూ రోజుకూ కనీసం 100 మందికి పంపిణీ చేయడానికి సన్నాహాలు చేసింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.

ఈనెల 25 నుంచి...

టీకాల పంపిణీ లక్ష్యానికి తగ్గట్లుగా అన్ని జిల్లా కేంద్ర గిడ్డంగులతో పాటు రాష్ట్రంలోని 866 కోల్డ్‌ చైన్‌ పాయింట్లకు... లక్ష 70 వేల డోసుల వ్యాక్సిన్ల సరఫరాకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర కార్యాలయం నుంచి ముందుగా జిల్లాలకు, అక్కడి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని కోల్డ్‌ చైన్‌ పాయింట్లకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అటు ఈనెల 25 నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యసిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఇవీ చదవండి :

వ్యాక్సినేషన్ సక్సెస్... కిష్టమ్మకు తొలిటీకా

కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!

'వ్యాక్సినేషన్ విజయవంతం... సీఎం కృషి అభినందనీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.