ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ.. ద్విచక్ర వాహనదారుడు మృతి - గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి

తెల్లవారుజామున బేగంపేట ప్రకాష్ నగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్నకరీంనగర్​ వాసి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీ .. ద్విచక్ర వాహనదారుడు మృతి
author img

By

Published : Sep 19, 2019, 12:58 PM IST

బేగంపేట ప్రకాశ్​నగర్​ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడ్ని కరీంనగర్​కి చెందిన రాజేశ్​గా పోలీసులు గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు వెల్లడించారు. రాజేశ్ ద్విచక్ర వాహనంపై​ పంజాగుట్ట వైపు వెళ్తున్న సమయంలో ప్రకాశ్​నగర్ వద్ద ఉన్న మెట్రోపిల్లర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన రాజేశ్​ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీ .. ద్విచక్ర వాహనదారుడు మృతి

ఇదీ చూడండి: చిన్న వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ

బేగంపేట ప్రకాశ్​నగర్​ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడ్ని కరీంనగర్​కి చెందిన రాజేశ్​గా పోలీసులు గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు వెల్లడించారు. రాజేశ్ ద్విచక్ర వాహనంపై​ పంజాగుట్ట వైపు వెళ్తున్న సమయంలో ప్రకాశ్​నగర్ వద్ద ఉన్న మెట్రోపిల్లర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన రాజేశ్​ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీ .. ద్విచక్ర వాహనదారుడు మృతి

ఇదీ చూడండి: చిన్న వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.