ETV Bharat / state

హైకోర్టు తీర్పు తర్వాతే... ఆర్టీసీపై తుది నిర్ణయం

author img

By

Published : Nov 22, 2019, 5:18 AM IST

రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం తీర్పు తర్వాతే.. ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు.. కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయనున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యమే ప్రథమ కర్తవ్యంగా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది.

ఆర్టీసీపై తుది నిర్ణయం


ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేర్చుకుంటే.. సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగరావు, సునీల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ప్రసాద్... అదనపు ఏజీ రాంచందర్ రావు, ఆర్టీసీ ఈడీలతో ప్రగతి భవన్‌లో సీఎం 4 గంటలకు పైగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై... విస్తృతంగా చర్చించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా సమీక్షించారు.

ఐదువేల కోట్లకు పైగా అప్పులు..

ఆర్టీసీకి ఇప్పటికే ఐదువేల కోట్లకు పైగా అప్పులున్నాయని.. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. భవిష్యనిధి అధికారుల ఆదేశం మేరకు... ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ. 240 కోట్లు అవసరమని... సీసీఎస్​కు రూ. 500 కోట్లతో పాటు డీజిల్ బకాయిలు చెల్లించాలని అన్నారు. ఆర్టీసీ రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉందని... పీఎఫ్ బకాయిల కింద నెలకు 65 నుంచి 70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. కాలం చెల్లిన 2వేల 600 బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉందని అన్నారు. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాలని వివరించారు. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదని... ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సమావేశం తేల్చింది.

ఎంత వరకు కొనసాగుతుంది...?

ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా.. అది ఎంత వరకు కొనసాగించగలుతుందన్న విషయమై కూడా సమీక్షలో చర్చ జరిగింది. ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు ఛార్జీలు పెంచడమని... ఛార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా... ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ భావనగా తెలిపారు. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నందున... ఆ తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైకోర్టు తీర్పు తర్వాతే

ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం


ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేర్చుకుంటే.. సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగరావు, సునీల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ప్రసాద్... అదనపు ఏజీ రాంచందర్ రావు, ఆర్టీసీ ఈడీలతో ప్రగతి భవన్‌లో సీఎం 4 గంటలకు పైగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై... విస్తృతంగా చర్చించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా సమీక్షించారు.

ఐదువేల కోట్లకు పైగా అప్పులు..

ఆర్టీసీకి ఇప్పటికే ఐదువేల కోట్లకు పైగా అప్పులున్నాయని.. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. భవిష్యనిధి అధికారుల ఆదేశం మేరకు... ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ. 240 కోట్లు అవసరమని... సీసీఎస్​కు రూ. 500 కోట్లతో పాటు డీజిల్ బకాయిలు చెల్లించాలని అన్నారు. ఆర్టీసీ రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉందని... పీఎఫ్ బకాయిల కింద నెలకు 65 నుంచి 70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. కాలం చెల్లిన 2వేల 600 బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉందని అన్నారు. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాలని వివరించారు. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదని... ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సమావేశం తేల్చింది.

ఎంత వరకు కొనసాగుతుంది...?

ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా.. అది ఎంత వరకు కొనసాగించగలుతుందన్న విషయమై కూడా సమీక్షలో చర్చ జరిగింది. ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు ఛార్జీలు పెంచడమని... ఛార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా... ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ భావనగా తెలిపారు. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నందున... ఆ తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైకోర్టు తీర్పు తర్వాతే

ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం

TG_HYD_09_22_GOVT_ON_RTC_PKG_3053262 From : Raghu vardhan ( ) రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం తీర్పు తర్వాతే ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయనున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యమే ప్రథమ కర్తవ్యంగా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ భావన...లుక్ వాయిస్ ఓవర్ - ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ప్రసాద్, అదనపు ఏజీ రాంచందర్ రావు, ఆర్టీసీ ఈడీలతో ప్రగతి భవన్ లో సీఎం నాలుగు గంటలకు పైగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై విస్తృతంగా చర్చించారు. సంస్థ ఆర్థికపరిస్థితిపై విస్తృతంగా సమీక్షించారు. ఆర్టీసీకి ఇప్పటికే ఐదువేల కోట్లకు పైగా అప్పులున్నాయని... తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. భవిష్యనిధి అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే 240 కోట్ల రూపాయలు అవసరమని... సీసీఎస్ కు 500 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు డీజిల్ బకాయిలు చెల్లించాలని అన్నారు. ఆర్టీసీ రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉందని, పీఎఫ్ బకాయిల కింద నెలకు 65 నుంచి 70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. కాలం చెల్లిన 2600 బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉందని అన్నారు. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు 640 కోట్ల రూపాయలు కావాలని వివరించారు. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదని... ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సమావేశం తేల్చింది. ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుందన్న విషయమై కూడా సమీక్షలో చర్చ జరిగింది. ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడమని... చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, న్యాయస్థాన నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు, తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్య అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ భావనగా తెలిపారు. దీంతో పాటు రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నందున ఆ తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.